Kuldeep Yadv: అప్పుడు కుల్దీప్కు కేకేఆర్ ఛాన్స్ ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) విండీస్తో మూడు వన్డేల సిరీస్లో (WI vs IND) ఏడు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే, ఇక్కడ వరకు రావడానికి చాలా శ్రమించాడని అతడి చిన్ననాటి కోచ్ కపిల్ పాండే తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నాళ్లు బౌలింగ్లో లయను కోల్పోయి జాతీయ జట్టులోకి అడుగు పెట్టేందుకు భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఇబ్బంది పడ్డాడు. అయితే ఎట్టకేలకు విండీస్ పర్యటనకు (WI vs IND) ఎంపికై తన సత్తా ఏంటో చాటాడు. అయితే, మళ్లీ పుంజుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడని కుల్దీప్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే తెలిపారు. ఇలాంటి సమయంలో భారత జట్టు మేనేజ్మెంట్తోపాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ నుంచి సరైన మద్దతు లభించలేదని విమర్శించాడు. మరిన్ని అవకాశాలు ఇవ్వకపోవడంతో తానేంటో నిరూపించుకొనేందుకు కుల్దీప్ కష్టాలు పడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు.
వారిద్దరే కాదు.. అతడిలోనూ భవిష్యత్తు స్టార్ లక్షణాలు
‘‘కోల్కతా నైట్రైడర్స్ తుది జట్టులో ఆడించే అవకాశం ఇవ్వకపోవడం నుంచే కుల్దీప్ బౌలింగ్లో పతనం ప్రారంభమైంది. అయినా, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నెట్స్లో కష్టపడటం కళ్లారా చూశా. కొన్నిసార్లు నేను అతడిని మైదానం నుంచి బయటకు పంపించా. తన బౌలింగ్ లెంగ్త్, వేగంపై తీవ్రంగా కృషి చేశాడు. టీమ్ఇండియా మేనేజ్మెంట్ అవసరాలకు తగ్గట్టుగా మెరుగయ్యాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ లేదా ఐపీఎల్లో రాణించాలి. కానీ, ఇంత కష్టపడిన కుల్దీప్ యాదవ్కు మాత్రం ఐపీఎల్లోనూ అవకాశాలు రాలేదు. దీంతో ఒకానొక దశలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ‘సర్ ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ నాకు తన బాధను వెల్లడించాడు. ఆ సందర్భంగా ‘నిశ్శబ్దంగా ఉండు. క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది. పదికి తొమ్మిదిసార్లు నీ ఓపికను పరీక్షించడానికే ఇలా జరుగుతుంటుంది’ అని చెప్పా. జాతీయ జట్టులోకి రావాలని బలంగా కోరుకున్నాడు కాబట్టే ఇదొక సవాల్గా భావించాడు. మ్యాచ్లు ఆడని సమయంలో కూడా ప్రాక్టీస్ మీద ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. క్రికెట్లో అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తుంటాయి. ఐపీఎల్ అనేది కార్పొరేట్ సంస్థలాంటిది. ఇక్కడ ఎవరిని ప్రశ్నించే అధికారం ఉండదు’’ అని కపిల్ పాండే తెలిపారు.
అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ
జాతీయ జట్టుతోపాటు ఐపీఎల్లోనూ అవకాశాలు దక్కకపోవడంతో ఒకానొక దశలో కుల్దీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కోల్కతా నైట్రైడర్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, మరుసటి సీజన్ నాటికి ఫామ్ కోల్పోవడంతో తుది జట్టులో మాత్రం ఆడించకుండా అలాగే ఉంచేసింది. నాలుగేళ్లపాటు కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్ను 2022 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆ సీజన్లో 14 మ్యాచుల్లో 21 వికెట్లు తీసిన కుల్దీప్.. ఇటీవల సీజన్లోనూ 14 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ దొరికింది. ఇలాంటి ప్రదర్శనే కొనసాగితే వచ్చే ఆసియా కప్తోపాటు వన్డే వరల్డ్ కప్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు