Virat Kohli: వందలో ‘100’ కొట్టిన వీరులు వీరే.. అందులో కోహ్లీ చేరతాడా?
క్రికెట్లో ఏ ఆటగాడైనా దేశం తరఫున ఒక్క టెస్టు మ్యాచైనా ఆడాలని, ఒక్క సెంచరీ అయినా సాధించాలని కలలు కంటాడు. అలాంటిది ‘వంద టెస్టులు ఆడటం.. ఆ వందో మ్యాచ్లో వంద పరుగులు...
విరాట్ ముందు అరుదైన అవకాశం..
‘వంద టెస్టులు ఆడటం.. వందో మ్యాచ్లో వంద పరుగులు చేయడం’... మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. ఇప్పటివరకు వందల మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినా.. కేవలం 70 మంది మాత్రమే వంద టెస్టుల మైలురాయిని దాటారు. అందులో 9 మంది మాత్రమే అరుదైన వందలో ‘100’ ఘనతను సాధించారు. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సైతం ఆ అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్... 27 శతకాలు సాధించాడు. శుక్రవారం నుంచి శ్రీలంకతో ఆడే టెస్టు విరాట్కి వందోది. అందులో శతకం సాధిస్తే అరుదైన వందలో ‘100’ జాబితాలో చేరనున్న తొలి భారత క్రికెటర్గా నిలువనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వందో టెస్టులో వంద పరుగులు సాధించిన క్రీడాకారులు ఎవరో ఓ సారి తెలుసుకుందాం.
1️⃣ ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ కొలిన్ కౌడ్రే 1968లో తన వందో టెస్టులో శతకం బాదాడు. ఆస్ట్రేలియాతో ఆడిన ఆ మ్యాచ్లో అతడు 104 పరుగులు చేసి ఈ అరుదైన రికార్డు నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే వంద టెస్టులు ఆడిన తొలి ఆటగాడు కూడా అతడే కావడం విశేషం.
2️⃣ పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడు 1989లో టీమ్ఇండియాపై 145 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే, జావెద్ తన అరంగేట్రం టెస్టులోనూ శతకం సాధించడం మరో విశేషం. ఇలా తొలి టెస్టు, వందో టెస్టులో సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
3️⃣ వెస్టిండీస్ ఆటగాడు గార్డన్ గ్రీనిడ్జ్ సైతం అరంగేట్రంతో పాటు వందో టెస్టులోనూ శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 1990లో ఇంగ్లాండ్పై 149 పరుగులు సాధించి ఈ రికార్డు నమోదు చేశాడు. అలాగే గ్రీనిడ్జ్ తన వందో వన్డేలోనూ శతకం బాదాడు. ఇలా టెస్టుల్లో, వన్డేల్లో వందో మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
4️⃣ ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ అలెస్ స్టీవార్ట్ 2000 సంవత్సరంలో వెస్టిండీస్పై తన వందో టెస్టులో 105 పరుగులు సాధించి.. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
5️⃣ పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ 2005లో టీమ్ఇండియాపై ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్లో ఇంజీ 184 పరుగులు సాధించాడు. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన ఐదో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
6️⃣ ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో ఆరో క్రికెటర్గా నిలిచాడు. అతడు 2006లో దక్షిణాఫ్రికాపై తన వందో టెస్టులో (120, 143*) రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకం సాధించాడు. దీంతో ఇలా వందో టెస్టులో రెండు శతకాలు బాదిక ఏకైక క్రికెటర్గా కొత్త రికార్డు నమోదు చేశాడు.
7️⃣ దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ ఇంగ్లాండ్పై ఈ ఘనత సాధించాడు. 2012లో జరిగిన ఆ మ్యాచ్లో అతడు 131 పరుగులు చేసి వందో టెస్టులో శతకం బాదిన ఏడో క్రికెటర్గా నిలిచాడు.
8️⃣ దక్షిణాఫ్రికాకే చెందిన హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో చేరిన ఎనిమిదో బ్యాట్స్మన్గా నిలిచాడు. అతడు 2017లో శ్రీలంకతో ఆడిన వందో టెస్టులో 134 పరుగులు చేశాడు.
9️⃣ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్, టెస్టు కెప్టెన్ జో రూట్ గతేడాది టీమ్ఇండియాపై ఈ ఘనత సాధించాడు. దీంతో వందో టెస్టులో శతకం సాధించిన తొమ్మిదో క్రికెటర్గా నిలిచాడు. అయితే, అతడు ఆ ఒక్క ఇన్నింగ్స్లోనే 218 పరుగులు చేసి.. వందో టెస్టులో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్గా, అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
విరాట్ చేస్తాడా...
విరాట్ ఈ అరుదైన ఫీట్ సాధించాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే విరాట్ శతకం బాది రెండేళ్లకు పైనే అవుతోంది. ఇటీవలి కాలంలో కోహ్లీ అర్ధ శతకాలు సాధిస్తున్నా వాటిని శతకాలుగా మలచడానికి ఇబ్బందులు పడుతున్నాడు. కానీ, కోహ్లీ గతంలో కొన్ని కీలక సందర్భాల్లో అంచనాలకు మించి రాణించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇప్పుడూ అలాగే జరిగి తన వందో టెస్టులో వంద పరుగులు సాధిస్తే అటు అభిమానులకు, ఇటు కోహ్లీకి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అది నిజమవ్వాలని మనమూ ఆశిద్దాం. ఆ అరుదైన జాబితాలో మన దేశం ఆటగాడి పేరు ఎక్కాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ విరాట్.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి