IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. కళ్లన్నీ వారిపైనే.. ఫైనల్ XI ఎలా ఉండనుందో?
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను ఆడేందుకు భారత్ (IND vs AUS) రంగంలోకి దిగనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. కీలకమైన ఆటగాళ్లు లేకుండానే టీమ్ఇండియా ఈ మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది.
మెగా సమరం ముంగిట చివరి వన్డే సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న ఆస్ట్రేలియాతో (IND vs AUS) తలపడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో మొదటి రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ 22న (శుక్రవారం) మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. అయితే, కొందరు ఆటగాళ్ల విషయంలో జట్టు మేనేజ్మెంట్ తుది అంచనాకు రావడానికి ఈ సిరీస్ అత్యంత కీలకం.
రెండు స్థానాలు.. ముగ్గురు పోటీ
వరుస షెడ్యూల్ కారణంగా తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్లకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. మూడో వన్డే నాటికి సీనియర్లంతా వచ్చేస్తారు. ఇప్పటికే ప్రపంచకప్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28 వరకు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఐసీసీ అనుమతి మేరకు మార్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే, ఈ సిరీస్లో ప్రతిభ ఆధారంగా వన్డే ప్రపంచకప్ తుది స్క్వాడ్లో అవకాశం లభించే అవకాశాలు ఉంటాయి. తుది జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న వారి జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఆసీస్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకున్నా.. ఫైనల్ XI ఆడటం అనుమానంగానే ఉంది. ఆసియా కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడిని ఆసీస్తో తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. మూడో మ్యాచ్కు (సెప్టెంబర్ 27న) కూడా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అక్షర్ ఉంటాడు. లేకపోతే వరల్డ్ కప్కు దాదాపు దూరమైనట్లే.
వీరి ఆటపైనే దృష్టి..!
దాదాపు సంవత్సరం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ అంచనాల్లో లేని అశ్విన్ను ఇప్పుడు ఆసీస్తో సిరీస్కు ఎంపిక చేయడం గమనార్హం. అక్షర్ పటేల్ స్థానంలో వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చేందుకు ఛాన్స్ ఉంది. కానీ, దానికి యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో పోటీ పడాల్సిందే. బౌలింగ్, బ్యాటింగ్పరంగా చూస్తే సుందర్ కంటే అశ్విన్ బెటర్. కానీ, మైదానంలో చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించాలి. ఇక హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మకూ మొన్నటి వరకు వరల్డ్ కప్ తలుపులు మూసుకుపోయాయని అనుకున్నారంతా. కానీ, శ్రేయస్ పరిస్థితి అయోమయంగా మారడంతో తిలక్కూ ఓ ఛాన్స్ దొరికినట్లైంది. ఇప్పుడీ సిరీస్లో శ్రేయస్ ఆడలేకపోయి.. తిలక్కు తుది జట్టులో ఛాన్స్ దక్కి ఉత్తమ ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్లో ఆడటం దాదాపు ఖాయమవుతుంది.
ఆసీస్తో పోరులో ఎవరికి అవకాశం!
ఆసీస్తో తొలి వన్డేలో తుది జట్టుకు ఎవరిని ఆడించాలనేదే ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద సవాల్. ఆసియా గేమ్స్లో భారత్ జట్టుకు నాయకత్వం వహించనున్న రుతురాజ్ గైక్వాడ్ను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేసింది. పదకొండు మందిలో ఆడించకపోయినా.. జట్టుతోపాటు ఉండటం వల్ల ఆసియా గేమ్స్లో ఆ అనుభవం రుతురాజ్కు ఉపయోగపడుతుందనేది మేనేజ్మెంట్ అభిప్రాయం. రోహిత్ లేకపోవడంతో గిల్తో కలిసి ఓపెనర్గా ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలున్నాయి. వన్డౌన్లో కేఎల్ రాహుల్ వచ్చినా.. నాలుగో స్థానంలో శ్రేయస్ లేదా తిలక్ వర్మ ఆడతారు. సూర్యకుమార్ యాదవ్కు ఎలానూ ఐదో స్థానమే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జడేజా, సుందర్, అశ్విన్ ఉంటారు. బుమ్రా, సిరాజ్, షమీతోనే పేస్ బౌలింగ్ను వేయించే అవకాశాలు ఎక్కువ. అదనంగా బ్యాటర్ కావాలనుకుంటే ఆ ముగ్గురిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి శార్దూల్ను తీసుకొనే వెసులుబాటు ఉంది.
మ్యాచ్ షెడ్యూల్ ఇలా..
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా శుక్రవారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ను అరగంట ముందుగా వేస్తారు. ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా ఓటీటీతోపాటు స్పోర్ట్స్ 18 ఛానల్స్లో వీక్షించే అవకాశం ఉంది.
తుది జట్టు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్/తిలక్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్ఇండియా కోచింగ్ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. -
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
Rahul Dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర కోచింగ్ బృంద కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. -
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా