IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. కళ్లన్నీ వారిపైనే.. ఫైనల్ XI ఎలా ఉండనుందో?
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను ఆడేందుకు భారత్ (IND vs AUS) రంగంలోకి దిగనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. కీలకమైన ఆటగాళ్లు లేకుండానే టీమ్ఇండియా ఈ మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది.
మెగా సమరం ముంగిట చివరి వన్డే సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న ఆస్ట్రేలియాతో (IND vs AUS) తలపడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో మొదటి రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ 22న (శుక్రవారం) మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. అయితే, కొందరు ఆటగాళ్ల విషయంలో జట్టు మేనేజ్మెంట్ తుది అంచనాకు రావడానికి ఈ సిరీస్ అత్యంత కీలకం.
రెండు స్థానాలు.. ముగ్గురు పోటీ
వరుస షెడ్యూల్ కారణంగా తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్లకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. మూడో వన్డే నాటికి సీనియర్లంతా వచ్చేస్తారు. ఇప్పటికే ప్రపంచకప్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28 వరకు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఐసీసీ అనుమతి మేరకు మార్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే, ఈ సిరీస్లో ప్రతిభ ఆధారంగా వన్డే ప్రపంచకప్ తుది స్క్వాడ్లో అవకాశం లభించే అవకాశాలు ఉంటాయి. తుది జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న వారి జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఆసీస్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకున్నా.. ఫైనల్ XI ఆడటం అనుమానంగానే ఉంది. ఆసియా కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడిని ఆసీస్తో తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. మూడో మ్యాచ్కు (సెప్టెంబర్ 27న) కూడా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అక్షర్ ఉంటాడు. లేకపోతే వరల్డ్ కప్కు దాదాపు దూరమైనట్లే.
వీరి ఆటపైనే దృష్టి..!
దాదాపు సంవత్సరం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ అంచనాల్లో లేని అశ్విన్ను ఇప్పుడు ఆసీస్తో సిరీస్కు ఎంపిక చేయడం గమనార్హం. అక్షర్ పటేల్ స్థానంలో వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చేందుకు ఛాన్స్ ఉంది. కానీ, దానికి యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో పోటీ పడాల్సిందే. బౌలింగ్, బ్యాటింగ్పరంగా చూస్తే సుందర్ కంటే అశ్విన్ బెటర్. కానీ, మైదానంలో చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించాలి. ఇక హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మకూ మొన్నటి వరకు వరల్డ్ కప్ తలుపులు మూసుకుపోయాయని అనుకున్నారంతా. కానీ, శ్రేయస్ పరిస్థితి అయోమయంగా మారడంతో తిలక్కూ ఓ ఛాన్స్ దొరికినట్లైంది. ఇప్పుడీ సిరీస్లో శ్రేయస్ ఆడలేకపోయి.. తిలక్కు తుది జట్టులో ఛాన్స్ దక్కి ఉత్తమ ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్లో ఆడటం దాదాపు ఖాయమవుతుంది.
ఆసీస్తో పోరులో ఎవరికి అవకాశం!
ఆసీస్తో తొలి వన్డేలో తుది జట్టుకు ఎవరిని ఆడించాలనేదే ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద సవాల్. ఆసియా గేమ్స్లో భారత్ జట్టుకు నాయకత్వం వహించనున్న రుతురాజ్ గైక్వాడ్ను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేసింది. పదకొండు మందిలో ఆడించకపోయినా.. జట్టుతోపాటు ఉండటం వల్ల ఆసియా గేమ్స్లో ఆ అనుభవం రుతురాజ్కు ఉపయోగపడుతుందనేది మేనేజ్మెంట్ అభిప్రాయం. రోహిత్ లేకపోవడంతో గిల్తో కలిసి ఓపెనర్గా ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలున్నాయి. వన్డౌన్లో కేఎల్ రాహుల్ వచ్చినా.. నాలుగో స్థానంలో శ్రేయస్ లేదా తిలక్ వర్మ ఆడతారు. సూర్యకుమార్ యాదవ్కు ఎలానూ ఐదో స్థానమే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జడేజా, సుందర్, అశ్విన్ ఉంటారు. బుమ్రా, సిరాజ్, షమీతోనే పేస్ బౌలింగ్ను వేయించే అవకాశాలు ఎక్కువ. అదనంగా బ్యాటర్ కావాలనుకుంటే ఆ ముగ్గురిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి శార్దూల్ను తీసుకొనే వెసులుబాటు ఉంది.
మ్యాచ్ షెడ్యూల్ ఇలా..
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా శుక్రవారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ను అరగంట ముందుగా వేస్తారు. ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా ఓటీటీతోపాటు స్పోర్ట్స్ 18 ఛానల్స్లో వీక్షించే అవకాశం ఉంది.
తుది జట్టు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్/తిలక్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?