IND vs AUS: ఆసీస్తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్కు ఇదేనా చివరి ఛాన్స్..?
ఇందౌర్ వేదికగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడే సిరీస్ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
కీలక ఆటగాళ్లు లేకపోయినా సమష్టిగా రాణించి.. బలమైన ఆసీస్ను ఓడించారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకూ క్రీజ్లో ఉండి గెలిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లోనూ భారత్ నంబర్వన్ ర్యాంక్కు చేరింది. 50 ఓవర్ల క్రికెట్లో ఇబ్బందిపడిన సూర్య మళ్లీ ఫామ్ అందుకొన్నట్లే కనిపించాడు. బ్యాటింగ్లో ఒకరు.. బౌలింగ్లో ఒకరు మినహా మిగతావారు రాణించారు. వరల్డ్ కప్ ముంగిట ఆ ఇద్దరి విషయంలోనే మేనేజ్మెంట్తోపాటు అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..?
శ్రేయస్కు కీలకం..
నలుగురు భారత బ్యాటర్లు అర్ధశతకాలు అలరించారు. ఆసీస్ పేస్ను ఎదుర్కొని ఓపెనర్లుగా వచ్చిన శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక రెండో వన్డేలోనూ వీరిద్దరే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్కూ రోహిత్, విరాట్ అందుబాటులో ఉండరు. అయితే, మొదటి వన్డేలో వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో ఓపెనర్లు శుభారంభమిచ్చినా.. శ్రేయస్ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అటు ఫీల్డింగ్లోనూ చురుగ్గా ఉండలేకపోయాడు. క్యాచ్లను కూడా విడిచిపెట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా..? లేదా..? అనే అనుమానం కలగకమానదు. అందుకే, రెండో వన్డే అతడికి చాలా కీలకం. ఈసారి ఆడకపోతే మాత్రం మూడో వన్డేతోపాటు వరల్డ్ కప్లో స్థానం గల్లంతు కావడం ఖాయం. నాలుగోస్థానంలో వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ కూడా ఫిఫ్టీతో ఫామ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు బంతి శ్రేయస్ కోర్టులోనే ఉంది. ఈ మ్యాచ్లో సరిగా ఆడకపోతే మాత్రం.. మూడో వన్డే నాటికి విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు. అప్పుడు శ్రేయస్పైనే వేటు పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ పేస్ ఆల్రౌండర్ పరిస్థితేంటో?
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా రాణించారు. షమీ ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు. అయితే, ఒకే ఒక్క బౌలర్ మాత్రం భారీగా పరుగులు సమర్పించాడు. అతడే శార్దూల్ ఠాకూర్. ఆసీస్పై తొలి వన్డేలో వికెట్ తీయకుండా 78 పరుగులు సమర్పించాడు. హార్దిక్ పాండ్యతోపాటు పేస్ ఆల్రౌండర్గా అక్కరకొస్తాడని భావించినా.. ‘లార్డ్’ శార్దూల్ మాత్రం తనస్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. రెండోవన్డేలోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే మాత్రం వరల్డ్ కప్ ఛాన్స్ చేజారే ప్రమాదం లేకపోలేదు. మూడో వన్డేలో హార్దిక్ రంగంలోకి దిగుతాడు. దీంతో శార్దూల్కు తుది జట్టులో స్థానం కష్టమే. వరల్డ్ కప్లో ఆడే పూర్తిస్థాయి జట్టు ఎలా ఉంటుందో.. మూడో వన్డేలో బరిలోకి దిగే టీమ్ కూడా దాదాపు అలాగే ఉండొచ్చని ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సిరీస్కు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అశ్విన్ ఈసారి కూడా..
దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి వచ్చినా సరే.. తనకేమీ కొత్త ఫార్మాట్ కాదన్నట్లుగా అశ్విన్ బౌలింగ్ ఉంది. పది ఓవర్ల కోటాను అలవోకగా పూర్తి చేసేశాడు. అందుకు కారణం కూడా టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసిన అనుభవం అశ్విన్ సొంతం. తన పది ఓవర్ల కోటాలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన అశ్విన్ కీలకమైన లబుషేన్ వికెట్ను తీశాడు. దీంతో అక్షర్ పటేల్ లేని లోటును తీర్చేసినట్లే. ఆసీస్తో చివరి వన్డే నాటికి అక్షర్ పటేల్ కోలుకుని వచ్చి జట్టుతోపాటు చేరితేనే ప్రపంచకప్ స్క్వాడ్లో కొనసాగుతాడు. ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే మాత్రం అక్షర్ స్థానంలో అశ్విన్కు మేనేజ్మెంట్ చోటు కల్పించనుంది. అందుకే, ఆసీస్తో రెండో వన్డేలోనూ అశ్విన్ రాణిస్తే మరో ఆప్షన్ వైపు చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రేసులో ఉన్నాడు. కానీ, ఆసియా కప్ ఫైనల్తోపాటు ఆసీస్తో సిరీస్కు ఎంపికైనా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు.
మ్యాచ్ షెడ్యూల్.. పిచ్ రిపోర్ట్
ఇందౌర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ను అరగంట ముందు వేస్తారు. జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్తోపాటు స్పోర్ట్స్ 18 ఛానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చు. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువే. అయినా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఇందౌర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీ లైన్లు కూడా చిన్నవే. దీంతో స్పిన్నర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. టాస్ గెలిచే జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
తుది జట్టు (అంచనా): శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/సిరాజ్, అశ్విన్, షమీ, బుమ్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్