Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్.. అదరగొట్టిన శార్దూల్.. తొలి రోజు ముంబయిదే జోరు
రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి, విదర్భ తలపడుతున్నాయి. ముంబయి తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 31/3 స్కోరుతో నిలిచింది.
ముంబయి: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్లో 41సార్లు ఛాంపియన్ అయిన ముంబయి.. రెండుసార్లు విజేతగా నిలిచిన విదర్భ తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వానీ (37) రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్ (75; 69 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాక్రే ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించిన విదర్భ తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 31/3 స్కోరుతో నిలిచింది. అథర్వ తైడే (21), ఆదిత్య థాక్రే (0) నాటౌట్గా క్రీజులో ఉన్నారు. వన్డౌన్ బ్యాటర్ ధ్రువ్ షోరె (0)ని శార్దూల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అమన్ (8), కరుణ్ నాయర్ (0)లను ధవళ్ కులకర్ణి వెనక్కి పంపాడు.
అనుహ్యంగా ఆరు వికెట్లు..
ఓపెనర్లు పృథ్వీ షా, భూపేన్ తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబయి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, అనుహ్యంగా వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముషీర్ ఖాన్ (6), కెప్టెన్ అజింక్య రహానె (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ టామోర్ (13) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. 111 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబయిని శార్దూల్ ఠాకూర్ ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన శార్దూల్ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయడంతో ముంబయి ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్