IPL 2024 Auction: ఈ సంప్రదాయం మంచిది కాదు.. ఓవర్సీస్ ప్లేయర్ల ఏజెంట్స్ తెలివైనోళ్లు: డీకే
ఐపీఎల్ మినీ వేలంలో రూ. 24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్ను కోల్కతా.. రూ.20.5 కోట్లు పెట్టి ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు, ప్యాట్ కమిన్స్ రూ.20.5 కోట్లు దక్కించుకుని సంచలనం సృష్టించారు. వేలంలోనే కాకుండా.. మొత్తంగా ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా రికార్డు నమోదు చేశారు. వారికి ఈ స్థాయి ధర దక్కడంపై టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తిక్ కాస్త విభిన్నంగా స్పందించాడు. ఇలాంటి భారీ మొత్తాలను సాధించేందుకు ఓవర్సీస్ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తెలివిగా వ్యవహరించారని వ్యాఖ్యానించాడు. వేలంలోని లొసుగులను వినియోగించుకుని ఇంత పెద్ద మొత్తం సొంతం చేసుకున్నారని, ఇలాంటి ట్రెండ్ ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు.
‘‘నేరుగా మినీ వేలానికి వచ్చే ఆటగాళ్లకు నేను పెద్ద ఫ్యాన్ను కాదు. వేలంలోని లొసుగులను పట్టుకుని విదేశీ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తమ తెలివితేటలను చక్కగా వాడారు. మెగా వేలంలోకి కాకుండా.. మినీ వేలంలోకి తీసుకొచ్చి భారీ ధర దక్కేలా చేయడంలో విజయవంతమయ్యారు. అయితే, ఇలాంటి ట్రెండ్ ఆరోగ్యకరమైన పోటీని దూరం చేస్తుంది. అందుకే, బీసీసీఐ ఇలాంటి సమస్యను అదుపు చేయగలదని భావిస్తున్నా. దాని కోసం నేను రెండు పరిష్కారాలను కూడా చెబుతున్నా’’ అని పోస్టు చేశాడు.
ఇది చక్కటి ఉదాహరణ..
‘‘మినీ వేలంలోకి వచ్చిన విదేశీ ఆటగాళ్లలో చాలా మందికి భారీ ధర దక్కింది. ఇలా చేయడం వల్ల భారత స్టార్ పేసర్లు తక్కువ మొత్తంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రాను తీసుకుంటే.. అతడి ధర రూ. 11 కోట్లు. కానీ, మినీ వేలంలోకి వచ్చిన కొందరికి అతడి కంటే అధిక ధర దక్కింది. గతేడాది కామెరూన్ గ్రీన్, సామ్ కరన్ రికార్డు ధరలను పొందారు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అదే దారిలో పయనించారు. ఇందులో వీరి పొరపాటేమీ లేదు. వారి ఏజెంట్లు కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలం కంటే ముందు ఈ మినీ వేలంలోకి తీసుకొచ్చారు. దీంతో ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న సొమ్ము నుంచి ఎక్కువ మొత్తం వెచ్చించాయి’’ అని డీకే చెప్పాడు.
పరిష్కారాలు ఇవిగో..
‘‘భారీ ధర ట్రెండింగ్ను అదుపులో ఉంచేందుకు రెండు పరిష్కారాలు. అందులో ఒకటి.. ఎవరైనా సరే మినీ వేలంలోకి రావాలనుకుంటే.. అంతకుముందు మెగా వేలంలో అతడు దక్కించుకున్న సొమ్మునే గరిష్ఠ పరిమితిగా పెట్టాలి. అప్పుడు సదరు ఫ్రాంచైజీ అతడిని కొనసాగించే అవకాశం ఉంటుంది. లేకపోయినా ఇలాంటి అనూహ్యమైన ధరలు సొంతం చేసుకునే అవకాశం ఉండదు. ఇక రెండోది.. మెగా వేలంలో భాగం కాకుండా.. మినీ వేలంలోకి వచ్చిన ఆటగాడు భారీ ధరను దక్కించుకున్నాడనుకుందాం. అప్పుడు ఆ జట్టులోని ఖరీదైన ఆటగాడికి ఎంత సొమ్ము చెల్లిస్తామో.. అంతే మొత్తం సదరు మినీ వేలం ద్వారా వచ్చిన ఆటగాడికి ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ మిగతా మొత్తాన్ని బీసీసీఐకి ఇచ్చేయాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని దినేశ్ కార్తిక్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!