IND vs SL: భారత్ చేతిలో శ్రీలంక చిత్తు.. నమోదైన రికార్డులు ఇవే..!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) వరుసగా ఏడు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా శ్రీలంకను చిత్తు చేసి రికార్డు విజయం నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో శ్రీలంకను భారత్ 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలు సాధించారు. దీంతో టీమ్ఇండియా 357/8 స్కోరు చేసింది. బౌలింగ్లో షమీ 5, సిరాజ్ 3.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీయడంతో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో విజయం సాధించడమే రికార్డు కాగా.. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
- వన్డేల్లో అత్యధికంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత బౌలర్ షమీ. అతడు ఇప్పటి వరకు నాలుగుసార్లు సాధించాడు. అతడి తర్వాత జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్ మూడేసి సార్లు సాధించారు.
- ఒకే వరల్డ్ కప్లో అత్యధికసార్లు నాలుగు వికెట్లు తీయడం ఇది షమీకి మూడోసారి. 2019 ఎడిషన్లోనూ మూడుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఓవరాల్గా షాహిద్ అఫ్రిది 2011లో నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు.
- ఇక వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా షమీనే. అతడు మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా 3 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
- వన్డే చరిత్రలో వరుసగా మూడుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్గా షమీ అవతరించాడు. అలాగే రెండుసార్లు ఇలాంటి ప్రదర్శన చేయడం కూడా విశేషం. 2019 వరల్డ్ కప్లో వరుసగా మూడు ఇన్నింగ్స్లో షమీ (4/40, 4/16, 5/69) ఈ ఘనత సాధించాడు. పాక్ దిగ్గజం వకార్ యూనిస్ మాత్రమే మూడుసార్లు (1990లో రెండుసార్లు, 1994లో ఒకసారి) సాధించడం విశేషం.
- వన్డేల్లో అత్యంత భారీ తేడాతో గెలిచిన నాలుగో మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకపైనే భారత్ 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వరల్డ్ కప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం. ఇదే వరల్డ్ కప్లో నెదర్లాండ్స్పై ఆసీస్ 309 పరుగుల తేడాతో గెలిచింది.
- వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐసీసీ సభ్య దేశాల్లో శ్రీలంక ఒకటి. ఇప్పుడు శ్రీలంక 55 పరుగులే చేసింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్పై ఉండేది. 2011 వరల్డ్ కప్లో విండీస్పై 58 పరుగులే చేయగలిగింది.
- వన్డేల్లో భారత్పై అత్యల్ప స్కోరు నమోదు చేయడం శ్రీలంకకు ఇది రెండోసారి. కొలంబో వేదికగా 50 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 55 పరుగులకే ఆలౌటైంది.
- వరల్డ్ కప్ మ్యాచుల్లో ఒక ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్గా పెవిలియన్కు చేరడం ఇది ఎనిమిదోసారి. శ్రీలంకకు రెండోసారి కావడం గమనార్హం. 2003 వరల్డ్ కప్లోనూ భారత్పైనే శ్రీలంక ఐదుగురు బ్యాటర్లు సున్నాకే ఔటయ్యారు.
- ఒక్క బ్యాటర్ సెంచరీ చేయకుండా అత్యధిక స్కోరు (357/8) నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ముగ్గురు ఆటగాళ్లు భారీ అర్ధశతకాలు (గిల్ -92, విరాట్ -88, శ్రేయస్ -82) సాధించారు. అంతకుముందు ఇంగ్లాండ్పై పాక్ (2019లో) 348/8 స్కోరు చేసింది.
- వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక ఇన్నింగ్స్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన ఐదో మ్యాచ్ ఇది. శ్రీలంకపై టీమ్ఇండియా బ్యాటర్లు 9 సిక్సర్లు బాదారు. వ్యక్తిగతంగా శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఈ మ్యాచ్లో ఆరు సిక్స్లు కొట్టాడు. ఇలా ఒక మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఐదో బ్యాటర్గా అయ్యర్ నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం