Rohit Sharma: కెప్టెన్ కోరుకునేది ఇదే కదా.. రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ స్పీచ్ వైరల్
దిల్లీపై విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టు సభ్యులనుద్దేశించి ప్రసంగించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్, బలమైన జట్లలో ముంబయి ఒకటి. ఐపీఎల్ 17 సీజన్లోనూ ఆ జట్టు పటిష్టంగానే ఉంది. కానీ, మూడు మ్యాచ్ల్లో ఓటమి తర్వాత గెలుపు రుచి చూసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో దిల్లీతో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) (49), ఇషాన్ కిషన్ (42) దూకుడుతో ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించిన ముంబయి.. టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) మెరుపులతో 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో దిల్లీ 205/8కి పరిమితమైంది.
ఈ సీజన్ నుంచి ముంబయి కొత్త సంప్రదాయానికి తెరతీసింది. మ్యాచ్లో బాగా ఆడిన ఆటగాళ్లకు స్పెషల్ అవార్డ్స్ అందిస్తోంది. ఈ క్రమంలో దిల్లీతో మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్శర్మకు మెడల్ను అందించారు. దిల్లీపై సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టినందుకు రోహిత్కు మెడల్ అందించాలని ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ అనౌన్స్ చేయగా బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ అందజేశాడు.
అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. ‘‘మన బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ నుంచి మనందరం దీని కోసమే ప్రయత్నిస్తున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవద్దు. బ్యాటింగ్ విభాగంలోని ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని అందిస్తే లక్ష్యాన్ని చేరుకోగలం. అలాంటప్పుడే ఇలాంటి భారీ స్కోర్లు చేయగలం. మనం చాలా రోజులుగా దీని గురించే చర్చించుకుంటున్నాం కదా!. బ్యాటింగ్ కోచ్ (పొలార్డ్), మార్క్ బౌచర్ (ప్రధాన కోచ్), కెప్టెన్ (హార్దిక్ పాండ్య) మన నుంచి ఆశిస్తున్నది ఇదే’’ అని రోహిత్ శర్మ జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా వైరల్గా మారింది. ముంబయి తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 11న బెంగళూరుతో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!