Sanju Samson: సంజూకి ఆ సమయం ముగుస్తోంది.. ఇలాగే కొనసాగితే కష్టమే: పార్థివ్
సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్కు (Sanju Samson) అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడం మాత్రం విఫలమయ్యాడు. ఇప్పుడదే అతడి భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అవకాశాలు కోసం ఎదురు చూసిన సంజూ శాంసన్ (Sanju Samson).. ఇప్పుడు విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. విండీస్తో టీ20 సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో సంజూ 12, 7 పరుగుల చొప్పున స్కోరు చేశాడు. అంతకుముందు మూడో వన్డేలో మాత్రం హాఫ్ సెంచరీతో అలరించాడు. కానీ, తనకు అచ్చొచ్చే పొట్టి ఫార్మాట్లో విఫలం కావడం గమనార్హం. ఇక మిగిలిన మూడు టీ20ల్లోనూ తుది జట్టులో అవకాశం లభించినా.. ఉత్తమ ప్రదర్శన చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కొనసాగితే అతడు మెగా టోర్నీలో ఆడాలనే కల సాకారం కావడం కష్టమేనని పేర్కొన్నారు.
ఆ వరల్డ్ కప్ మ్యాచ్లను చూడొద్దనుకున్నా.. కానీ: రోహిత్
‘‘భారత్ ఓడిపోయినప్పుడల్లా నెగిటివ్ పాయింట్లు గురించి వెతుకుతూ ఉంటాం. వన్డే, టీ20 సిరీసుల్లో ఎక్కువగా బ్యాటర్ల గురించే మాట్లాడతాం. వారు సరిగా ఆడటం లేదని విమర్శిస్తాం. ఇప్పుడు సంజూ శాంసన్ గురించి చర్చ మొదలైంది. అయితే, భారత్ ఓడిన ప్రతిసారీ సంజూ జట్టులో లేడనే విషయం గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో సంజూ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ విఫలం కావడం నిరుత్సాహానికి గురి చేసే అంశం. దీంతో భవిష్యత్తులో అతడికి అవకాశాలు వస్తాయో.. లేదో ఇప్పుడే చెప్పలేం. అతడి అవకాశాలకు సమయం ముగిసిపోతోందని మాత్రం అనిపిస్తోంది. ఇటీవల సంజూకి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిని అందిపుచ్చుకోలేదు. అయితే, యువ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకొన్నాడు. రెండు మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు’’ అని పార్థివ్ తెలిపాడు.
అతడికి అక్కడ చోటు కష్టమే: అశ్విన్
‘‘కేవలం రెండు నెలల్లోనే మెగా టోర్నీ ఆడబోతున్నాం. విండీస్తో మూడో వన్డేలో సంజూ నాలుగో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, వన్డే ప్రపంచకప్లో మాత్రం టాప్ - 4లో ఖాళీ లేదు. మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. అయితే, సంజూ ఐపీఎల్లో వన్డౌన్ లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ భారత టాప్ ఆర్డర్లో ఖాళీ లేదు. వరల్డ్ కప్ ముగిశాకే ఆ స్థానంలో ఆడే అవకాశం సంజూకి రావచ్చు. రోహిత్ - గిల్ ఓపెనర్లు. విరాట్ కోహ్లీ మూడో స్థానం ఫిక్స్. శ్రేయస్ లేదా కేఎల్ రాహుల్లో ఒకరు ఫిట్నెస్ సాధించి వస్తే వారిదే నాలుగో స్థానం. వీరిద్దరిలో ఒకరు అందుబాటులో లేకపోతే బ్యాకప్ ఉండాల్సిన అవసరం ఉంది. దాని కోసం సంజూతోపాటు తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నాడు’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.