Shubman Gill: ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్.. పాకిస్థాన్తో మ్యాచ్కూ డౌటే!
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అనారోగ్యం కారణంగా మరో మ్యాచ్కూ దూరమయ్యాడు. పాకిస్థాన్తో మ్యాచ్కూ అతడు అందుబాటులో ఉండేది అనుమానమే.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న అతడు.. ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రేపు (బుధవారం) అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్కూ అందుబాటులో ఉండటం లేదు. అఫ్గాన్తో మ్యాచ్ కోసం అతడు దిల్లీ బయలుదేరలేదని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా గిల్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ‘‘ప్లేట్లెట్ కౌంట్ 70,000కు పడిపోవడంతో ముందు జాగ్రత్తగా గిల్ను ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అవసరమైన టెస్టులు నిర్వహించారు. సోమవారం అతడిని డిశ్చార్జ్ చేశారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
పాకిస్థాన్తో మ్యాచ్కూ దూరం!
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్కు గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డెంగీ ఫీవర్తో బాధపడుతున్న గిల్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టనుంది. మరోవైపు, పాక్తో మ్యాచ్కు నాలుగు రోజుల సమయమే ఉంది. దీంతో ఆ మ్యాచ్లో గిల్ ఆడేది అనుమానమే. ఆసీస్తో మ్యాచ్లో గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. శుభ్మన్ అందుబాటులోకి వచ్చేవరకు రోహిత్తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు.
జోరుమీదున్న టీమ్ఇండియా
ఆసీస్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్లో శుభారంభం చేసిన టీమ్ఇండియా మరో విజయంపై కన్నేసింది. బుధవారం అఫ్గాన్తో జరిగే మ్యాచ్లోనూ ఘన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగన మ్యాచ్లో బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటింగ్లో రోహిత్, ఇషాన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అఫ్గానిస్థాన్తో మ్యాచ్లో రాణించాలని కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్