ఈ విజయం అద్భుతం.. అపూర్వం..
మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘన విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది....
టీమిండియాకు శుభాకాంక్షల వెల్లువ
ఇంటర్నెట్ డెస్క్: మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘన విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్పై 8 వికెట్ల తేడాతో మరపురాని విజయం సొంతం చేసుకున్న టీమిండియా ఆటతీరును దిగ్గజాలు కొనియాడారు. సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షమి, ఇశాంత్ శర్మ అందుబాటులో లేకపోయినా రహానె జట్టును ముందుండి నడిపించిన విధానం.. బౌలర్లను సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు. జట్టులో అందుబాటులో లేని విరాట్ కూడా జట్టు సభ్యులను, కెప్టెన్ను కొనియాడాడు.
మొదటి టెస్టులో ఓటమితో వెనుకబడి.. సిరీస్ను సమం చేసేందుకు జట్టు చూపిన తెగువ ఎంతగానో ఆకట్టుకుంది. విరాట్, రోహిత్, ఇశాంత్, షమి లేకుండా టెస్టు మ్యాచ్లో మీరు సాధించిన విజయం ఎంతో ప్రత్యేకమైనది. వెల్డన్ టీమిండియా.- సచిన్
ఇది అద్భుతమైన విజయం. జట్టు సమష్టి కృషికి దక్కిన ఫలితం. సభ్యుల ఆట తీరు.. ముఖ్యంగా రహానె జట్టును నడిపించిన విధానం ప్రశంసనీయం. విజయాలను ఇలాగే కొనసాగించండి - విరాట్ కోహ్లీ
ఈ విజయంలో ఎన్నో సానుకూలంశాలున్నాయి. జట్టును రహానే అద్భుతంగా నడిపించాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన ఇద్దరి ఆట ఎంతో ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో వారు ఆడిన విధానం ప్రశంసనీయం. - వీవీఎస్ లక్ష్మణ్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ విజయం అపూర్వమైనది. రహానె జట్టును ముందుండి నడిపించాడు. బౌలర్లు విధ్వంసం సృష్టించారు. గిల్ ఆకట్టుకున్నాడు.-వీరేంద్ర సెహ్వాగ్
మరిచిపోలేని విజయం. సీనియర్లు అందుబాలులో లేనప్పటికీ భారత జట్టు ఆడిన నాణ్యమైన ఆట ఆకట్టుకుంది. విదేశాల్లో గొప్పగా గెలిచిన మ్యాచ్చుల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. రహానెతోపాటు ఆ జట్టుకు శుభాకాంక్షలు. - ఆకాశ్ చోప్రా
మెల్బోర్న్లో టీమ్ఇండియాకు అద్భుత విజయం దక్కింది. మ్యాచ్ మొత్తంలో ఆటగాళ్ల పట్టుదల, అంకితభావం చూడముచ్చటగా అనిపించాయి. -రోహిత్ శర్మ
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.