IND vs SL: శ్రీలంకతో రెండో టీ20.. ఈసారి భారత టాప్ఆర్డర్ ఆడాల్సిందే..!
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను భారత్ శుభారంభం చేసింది. అయితే మిడిలార్డర్తోపాటు బౌలింగ్లో యువకులు రాణించడంతో కేవలం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: విజయంతో టీమ్ఇండియా(team india) కొత్త సంవత్సరం ప్రారంభించింది. ‘మిషన్ - 2024’లో భాగంగా స్వదేశం వేదికగా శ్రీలంక(Ind vs SL)తో టీ20 సిరీస్(T20 series)ను ఆడుతోంది. అయితే తొలి మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. గతంలో మాదిరిగా ఆధిపత్యం ప్రదర్శించడంలో మాత్రం విఫలమైంది. ప్రత్యర్థి శ్రీలంకను తక్కువగా అంచనా వేయడంలేదు కానీ.. టీమ్ఇండియా తన బలహీనతలను మరోసారి బయటపెట్టుకుంది. మరి తొలి టీ20లో జరిగిన లోపాలేంటి? రెండో మ్యాచ్లో సరిచేసుకోవాల్సిన అంశాలంటో చూద్దాం..!
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుణె వేదికగా గురువారం రెండో మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ జరిగిన వాంఖడే స్టేడియం(Wankhede Stadium) బ్యాటింగ్కు అనుకూలమని క్రికెట్ విశ్లేషకుల అంచనా. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. తీరా చివరికి వచ్చేసరికి 162/5 స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. ముగ్గురు కీలకమైన బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఆ ఒక్కడు మినహా మిగతా టాప్ఆర్డర్ విఫలం
టీ20ల్లో భారీ స్కోరు సాధించాలంటే ఓపెనర్లతోపాటు టాప్ ఆర్డర్ రాణించడం చాలా ముఖ్యం. అయితే లంకతో తొలి మ్యాచ్లో మాత్రం ఇషాన్ కిషన్(Ishan Kishan) (37) మినహా టాప్ - 4లోని ముగ్గురు బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి మ్యాచ్ ఆడిన శుబ్మన్ గిల్(Shubman Gill) (7)తోపాటు ఎన్నో అంచనాలు పెట్టుకొన్న వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) (7), అవకాశం రావడంలేదన్న కారణంతో సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు కూడగట్టుకొన్న సంజూ శాంసన్ (5) ఘోరంగా విఫలం కావడం భారత శిబిరాన్ని ఆందోళనకు గురయ్యేలా చేసింది. రెండో మ్యాచ్లోనైనా టాప్ ఆర్డర్ రాణించాల్సి అవసరం ఎంతైనా ఉంది. భారీ లక్ష్యం లేకపోతే శ్రీలంక బ్యాటర్లు తమ వైపు మ్యాచ్ను తిప్పేయగల సమర్థులు. తొలి టీ20ల్లోనే విజయ తీరాల వరకు వచ్చి భారత్ను హడలెత్తించారు.
బౌలింగ్లో.. హర్షల్కు ఏమైంది..?
భారత పిచ్లు సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. కానీ శ్రీలంకతో తొలి టీ20లో మాత్రం అనూహ్యంగా పేసర్లకు సహకరించడం గమనార్హం. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి (4/22) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే ఉమ్రాన్ మాలిక్ (2/27) కూడా రాణించాడు. ఈ మ్యాచ్లోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా అవతరించాడు. అయితే హర్షల్ పటేల్ (2/41) వికెట్లు తీసినా.. మళ్లీ తన ‘19వ’ ఓవర్ ఫోబియాను కొనసాగించాడు. రెండో టీ20లో ఈ పొరపాటు పునరావృతం కాకూడదు. హార్దిక్ కూడా మూడు ఓవర్లు వేసి వికెట్ తీయకపోయినా 12 పరుగులే ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్ (0/31) చివరి ఓవర్లో భారత్ను గెలిపించాడు. కానీ బౌలింగ్ ఏమీ గొప్పగా లేదు. అలాగే చాహల్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 26 పరుగులు సమర్పించాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో చోటు దక్కాలంటే తన మణికట్టు మాయాజలాన్ని ప్రదర్శించాల్సిందే.
కెప్టెన్సీ అదుర్స్.. గాయం పరిస్థితేంటో..
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన తొలిసారే కప్ను గెలిచిన హార్దిక్ పాండ్య.. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గతంలోనూ చూశాం. ఇప్పుడు ‘మిషన్ - 2024’లో భాగంగా టీ20 సిరీస్కు కెప్టెన్గా వచ్చిన హార్దిక్ మంచి మార్కులే కొట్టేశాడు. తొలుత బ్యాటింగ్లో కీలకమైన పరుగులు సాధించాడు. అలాగే అవసరమైన సందర్భంలో బౌలింగ్లోనూ ముందుకొచ్చి సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపాడు. ఎవరైనా ఆటగాడు పొరపాట్లు చేస్తే విసుక్కోకుండా ధైర్యం చెప్పాడు. అలాగే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్, బౌలింగ్లో మార్పులు చేస్తూ నాయకుడిగా ఆకట్టుకొన్నాడు. అయితే తొలి మ్యాచ్లో బౌలింగ్ సందర్భంగా వెన్ను నొప్పికి గురికాగా.. ఫీల్డింగ్ సమయంలోనూ కాలి కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిలాడిపోయాడు. అయితే గాయమేమీ పెద్ద సమస్య కాబోదని తొలి మ్యాచ్ అనంతరం హార్దిక్ చెప్పాడు. కాబట్టి రెండో టీ20కి హార్దిక్ పూర్తి స్థాయిలో బౌలింగ్ వేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత