WPL: చావోరేవో మ్యాచ్‌.. అదరగొట్టిన యూపీ బౌలర్లు

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్‌ తలపడుతోంది.

Published : 11 Mar 2024 21:03 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో ఇవాళ కీలక మ్యాచ్‌ జరుగుతోంది. చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌ యూపీకి చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో కీలక మ్యాచ్‌లో యూపీ బౌలర్లు అదరగొట్టారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను 152/8కి కట్టడి చేశారు. ఓపెనర్లు లారా వోల్వార్ట్ (43; 30 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), బెత్‌ మూనీ (74; 52 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ (15) పరుగులు చేసింది. హేమలత (0), లిచ్‌ఫీల్డ్ (4) నిరాశపర్చారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్‌ 3, దీప్తి శర్మ 2, చమరి ఆటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని