UP Warriorz vs RCB: దంచికొట్టిన మంధాన.. యూపీ లక్ష్యం 199

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు దంచికొట్టింది. 

Updated : 04 Mar 2024 21:24 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు దంచికొట్టింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (80), ఎలీస్‌ పెర్రీ (58) అదరగొట్టడంతో.. ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు సబ్బినేని మేఘన (28), మంధాన కలిసి శుభారంభానిచ్చారు. తొలి వికెట్‌కు వీరు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత అంజలి బౌలింగ్‌లో ఆటపట్టుకి క్యాచ్‌ ఇచ్చి మేఘన వెనుదిరిగింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఎలీస్‌ పెర్రీతో కలిసి మంధాన దూకుడుగా ఆడింది. రిచా ఘోష్‌ (21*), సోఫీ (2*) నాటౌట్‌గా నిలిచారు. యూపీ బౌలర్లలో అంజలి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మరి 199 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని