WPL: దిల్లీ క్యాపిటల్స్కు షాక్.. యూపీ థ్రిల్లింగ్ విక్టరీ
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
దిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన దిల్లీ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ యూపీ బౌలర్లు అద్భుతంగా రాణించి చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. దిల్లీ జట్టులో కెప్టెన్ లానింగ్(60) మినహా మిగతావారు విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు తీయగా, గ్రేస్ హ్యారిస్, సైమా ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
మలుపు తిప్పిన చివరి రెండు ఓవర్లు..
18 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 124 పరుగులతో నిలిచిన దిల్లీ.. చివరి రెండు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 19 ఓవర్ వేసిన దీప్తి శర్మ కేవలం 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో లక్ష్యం చివరి ఓవర్లో 10 పరుగులుగా మారింది. 20 ఓవర్లో గ్రేస్ హ్యారిస్ బౌలింగ్లో తొలి బంతికే రాధా యాదవ్ సిక్స్ కొట్టడం, రెండో బంతికి రెండు పరుగులు రావడంతో అంతా దిల్లీ విజయం ఖాయమనుకున్నారు. అయితే మూడో బంతికి రాధాయాదవ్ బౌల్డ్ కాగా, నాలుగో బంతికి జొనాసెన్ రనౌట్ అయింది. దీంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. దిల్లీ చేతిలో ఒకవికెట్ మాత్రమే ఉంది. ఐదో బంతిని ఎదుర్కొన్న తితాస్ క్యాచ్ ఔట్ కావడంతో యూపీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (59), ఎలీసా హీలే (29) రాణించారు. యూపీ బౌలర్లలో టిటాస్ సధు, రాధా యాదవ్ చెరో 2, షికా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, ఎలిస్ కాప్సీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..