Virat Kohli: కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Published : 18 Apr 2024 19:58 IST

దిల్లీ: భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని జైపుర్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్‌ అనూప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదిగా పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి మ్యూజియంలో కోహ్లీ విగ్రహం ఏర్పాటుచేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు. ఆయన విగ్రహాన్ని ఈ మ్యూజియంలో పెట్టాలని వాళ్లంతా బలమైన అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అందువల్ల ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజు (ఏప్రిల్‌ 18న) కోహ్లీ విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టినట్లు వెల్లడించారు. 35 కిలోల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు రెండు నెలల సమయం పట్టింది.

ఐపీఎల్‌లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ

మరోవైపు, జైపుర్‌లోని నాహర్‌గఢ్‌ పోర్టు పరిసరాల్లో ఉన్న ఈ మ్యూజియంలో ఇప్పటికే 44 మైనపు విగ్రహాలను ఏర్పాటుచేశారు. వీటిలో జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఏపీజే అబ్దుల్‌ కలాం, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, కల్పనా చావ్లా, అమితాబ్‌ బచ్చన్‌, మదర్‌ థెరీసా, సచిన్‌ తెందూల్కర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ వంటి పలువురు ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని