IND vs SA: నా లక్ష్యం మాత్రం వచ్చే ఏడాది ప్రపంచకప్: తాత్కాలిక కెప్టెన్ ధావన్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను భారత్ కైవసం చేసుకొంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్నూ దక్కించుకొనేందుకు శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమ్ఇండియా సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ ధావన్ ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: సఫారీలతో మూడు వన్డేల సిరీస్ కోసం శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమ్ఇండియా సన్నద్ధమైంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్లను ధావన్ నేతృత్వంలో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. గత రెండేళ్ల నుంచి వన్డే ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ శిఖర్ ధావన్ కావడం విశేషం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ఫిట్గా తయారు కావడంపైనే దృష్టిసారించినట్లు ధావన్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం నేపథ్యంలో శిఖర్ ధావన్ ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడాడు.
‘‘నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. అందుకు కృతజ్ఞతుడిని. నా అనుభవం, నాలెడ్జ్ను యువ ఆటగాళ్లకు చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఇప్పుడు నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. ఇదొక అవకాశం తీసుకొని సవాళ్లను ఎదుర్కొంటా. అలాగే ఆటను ఆస్వాదిస్తా. అయితే నా లక్ష్యం మాత్రమే 2023 వన్డే ప్రపంచకప్. దాని కోసం నేను ఫిట్గా ఉండటంతోపాటు నా మనస్సును మంచి స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’’ అని ధావన్ వెల్లడించాడు.
వారిద్దరూ నా రోల్ మోడల్స్: రజత్ పాటిదార్
భారత టీ20 లీగ్ గత సీజన్లో అదరగొట్టి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్ రజత్ పాటిదార్ తన రోల్ మోడల్స్ ఎవరనేది చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమాన ఆటగాళ్లని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ నా రోల్ మోడల్స్. విరాట్తో కలిసి లీగ్లో మంచి భాగస్వామ్యాలు నిర్మించా. ఆఫ్ ఫీల్డ్లోనూ నా బ్యాటింగ్ గురించి కోహ్లీతో మాట్లాడుతూ ఉండేవాడిని. అతడి సలహాలు చాలా సాయపడ్డాయి. మ్యాచుల్లో వాటిని అమలు చేసి నా బ్యాటింగ్ను మెరుగుపర్చుకొన్నా. అభిమాన ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకుంటే వచ్చే అనుభూతి జీవితాంతం మరిచిపోలేము. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు’’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్