World Cup 2023: వన్డే ప్రపంచకప్.. కోల్కతాలో జరగాల్సిన పాక్ మ్యాచ్లో మార్పు?
నవంబర్ 12న కోల్కతాలో పాక్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్లకు సంబంధించి బీసీసీఐ, ఐసీసీలు తుది షెడ్యూల్ ప్రకటించాయి. అయితే మ్యాచ్ జరగాల్సిన వేదికలు, తేదీల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్తో జరగాల్సిన మ్యాచ్లకు సంబంధించి పాక్ జట్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భద్రతా పరంగా ఆందోళనల నేపథ్యంలో కొన్ని వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. ఇదిలా ఉండగా నవంబర్ 12న కోల్కతాలో పాక్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదే రోజున కోల్కతాలో కాళీమాత పూజ పెద్దఎత్తున జరుగుతుంది. దీనికి భారీగా పోలీసులు బలగాలు అవసరం. ఈ నేపథ్యంలో స్థానిక భద్రతా ఏజెన్సీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆ రోజు జరగాల్సిన పాకిస్థాన్ మ్యాచ్ను వేరే రోజుకు మార్చాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఐసీసీ రెక్కీ టీమ్ను అభ్యర్థించినట్లు సమాచారం.
ఒకవేళ బీసీసీఐ, ఐసీసీలు ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకొని మ్యాచ్ను వేరే రోజుకి మారిస్తే పాక్ షెడ్యూల్లో ఇది మూడో మార్పు అవుతుంది. ఇప్పటికే అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్ను 15కు మార్చారు. ఇక హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 10న జరగాల్సిన పాక్, శ్రీలంక మ్యాచ్ను 12కు మార్చారు. మరోవైపు అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై సైతం ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభంకానున్నాయి. దీంతో స్థానిక పోలీసులు మ్యాచ్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 27న బీసీసీఐ, ఐసీసీలు ప్రపంచకప్ షెడ్యూల్ను విడుదల చేశాయి. ఇప్పుడు పలు ఆందోళనల నేపథ్యంలో మార్పులు చేస్తారా లేక యథావిధిగా షెడ్యూల్ను కొనసాగిస్తారా అనేది స్పస్టత రావాల్సిఉంది. ఒకవేళ మ్యాచ్ల్లో మార్పులు చేస్తే దానికి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ను బీసీసీఐ, ఐసీసీలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ మార్పుపై బెంగాల్ క్రికెట్ క్లబ్(క్యాబ్) ప్రెసిడెంట్ స్నేహశిష్ గంగూలీ స్పందించారు. మ్యాచ్ తేదీని మార్పించాలని క్యాబ్ అభ్యర్థించినట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు