WPL 2024: ఆర్సీబీతో మ్యాచ్‌.. టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న యూపీ

బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూపీ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది.

Updated : 04 Mar 2024 19:29 IST

బెంగళూరు: డబ్ల్యూపీఎల్‌ 2024 లీగ్‌ దశలో భాగంగా మరికాసేపట్లో యూపీ వారియర్స్‌, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన యూపీ జట్టు కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నారు. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న ఈ జట్లకు.. ఈ మ్యాచ్‌ విజయం ఎంతో కీలకం. రెండు వరుస ఓటములతో డీలా పడిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పుంజుకుంటుందా.. యూపీ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేస్తుందా.. చూడాలి.

ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన, సోఫీ, మేఘన, ఎల్లీస్‌ పెర్రీ, రిచా ఘోష్‌, సోఫీ మొలినెక్స్‌, జార్జియా, ఎక్తా బిష్త్‌, సిమ్రాన్‌ బహదూర్‌, ఆశా శోభన, రేణుకా ఠాకూర్‌

యూపీ జట్టు : అలిసా హీలి, కిరణ్‌, చమరి ఆటపట్టు, గ్రేస్‌ హారిస్‌, శ్వేత, దీప్తి శర్మ, పూనమ్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, సైమా ఠాకూర్‌, అంజలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని