WPL Eliminator: రాణించిన ఎలీస్‌ పెర్రీ.. ముంబయి టార్గెట్‌ 136

డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మోస్తరు పరుగులు చేసింది.

Published : 15 Mar 2024 21:21 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మోస్తరు పరుగులు చేసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగి 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో.. ఒక దశలో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. క్లిష్ట సమయంలో ఎలీస్‌ పెర్రీ (66) గొప్పగా రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), సోఫీ డివైన్‌ (10)తో పాటు దిశా కసత్‌ (0), రిచా ఘోష్‌ (14), సోఫీ మోలినెక్స్‌ (11) విఫలమయ్యారు. జార్జియా వేర్‌హామ్‌ (18*),  శ్రేయంకా పాటిల్‌ (3*) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌ సీవర్‌, సైకా ఇషాక్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 136 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని