Yuvraj Singh: అప్పుడు కోహ్లీ సపోర్ట్ చేయకపోతే తిరిగి జట్టులోకి రాకపోయేవాడిని: యువరాజ్ సింగ్
2017లో తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడని యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా 2007, 2011 ప్రపంచకప్లు సాధించడంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీల్లో యువీ ఆడిన ఇన్నింగ్స్లను అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 2011 ప్రపంచకప్ ముగిసిన కొన్ని రోజులకు యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారినపడిన విషయం తెలిసిందే. కీమోథెరపి చేయించుకుని కోలుకున్న అతడు చాలా కాలంపాటు ఆటకు దూరంగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్గా మారిన అనంతరం మళ్లీ టీమ్ఇండియా తరఫున ఆడాడు. తర్వాత సరైన ప్రదర్శన చేయకపోవడంతో 2015 ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచ కప్లకు యువీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అనంతరం దేశవాళీ క్రికెట్లో రాణించి 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడాడు. ఈ నేపథ్యంలో 2017లో మళ్లీ జట్టులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మద్దతుగా నిలిచాడని యువరాజ్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2019 ప్రపంచకప్లో యువీ ఆడాలనుకున్నా సెలెక్టర్లు అతడిని విస్మరించారు. సెలెక్టర్లు తన పేరును పరిశీలించడం లేదని ధోనీ (MS Dhoni) చెప్పాడని యువీ పేర్కొన్నాడు.
‘‘2017లో నేను పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడు. అతను సపోర్ట్ చేయకపోతే నేను తిరిగి జట్టులోకి వచ్చేవాడిని కాదు. 2019 ప్రపంచకప్నకు సెలెక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు. వారు జట్టులోకి ఎందుకు తీసుకోట్లేదనే విషయాన్ని ధోనీ నాకు సవివరంగా వివరించాడు. 2011 ప్రపంచకప్ వరకు ధోనీ నాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ‘నువ్వు నా ప్రధాన ఆటగాడు’ అని నాతో చెప్పేవాడు. కానీ, క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఆటలో, టీమ్లో చాలా మార్పులు జరిగాయి. కెప్టెన్గా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జట్టు మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని యువరాజ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం