Rohit sharma: రోహిత్ కెప్టెన్సీకి యువరాజ్ సింగ్ ఇచ్చిన రేటింగ్ ఎంతంటే?
రోహిత్ శర్మ కెప్టెన్సీకి యువరాజ్ సింగ్ ఇచ్చిన రేటింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
దిల్లీ: కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోని(Mahendrasingh dhoni) వైదొలిగిన తర్వాత టీమ్ఇండియా(Team india) ముందు ఉన్న ఏకైక లక్ష్యం ఐసీసీ(ICC) ట్రోఫీని గెలవడమే. రోహిత్ శర్మ(Rohit sharma) నేతృత్వంలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్(T20 World cup)తోనూ ఈ కల నెరవేరలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట బంగ్లాదేశ్తో తొలి వన్డేలో టీమ్ఇండియా బ్యాటింగ్ వైఫల్యం బయటపడింది. ఈ నేపథ్యంలో రోహిత్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ క్రీడా వెబ్సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్ను నిర్వహించింది. దీనిపై నెటిజన్లు తమ స్పందనను రేటింగ్ రూపంలో తెలియజేశారు. ఈ పోల్లో యువరాజ్ సింగ్ సైతం పాల్గొని ఆశ్చర్యపరిచాడు. రోహిత్ కెప్టెన్సీకి తాను పదికి పది మార్కులు ఇస్తానని కామెంట్ చేశాడు. జాతీయ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శనలు చేసిన రోహిత్కు యువీ ఇచ్చిన రేటింగ్ సరైందేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..