Ravi Shastri - Virat Kohli: కోహ్లీ ఒక్కడే కాదు.. ఇంకా ఒకరిద్దరు అలాగే ఉన్నారు: రవిశాస్త్రి
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు. తాజా సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన విరాట్ 19.83 పేలవ సగటుతో 119 పరుగులే చేశాడు. గతరాత్రి లఖ్నవూతో ఆడిన మ్యాచ్లో గోల్డన్ డకౌటయ్యాడు. దీంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్కుముందు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతాడని, భారీ పరుగులు చేస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇలా విఫలమవుతూ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ఓ క్రీడా ఛానల్తో మాట్లాడాడు.
‘ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానుభూతితో ఉండాలి. వారిపై అనవసర ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. వాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. నేనిక్కడ నేరుగా కోహ్లీ పేరే చెప్పదల్చుకున్నా. అతడిప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. టీమ్ఇండియాలో ఎవరికైనా విశ్రాంతినివ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే. అది రెండు నెలలలైనా, నెలన్నర రోజులైనా ఫర్వాలేదు. అది కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు లేదా తర్వాత. అతడిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలా తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నది అతనొక్కడే కాదు. ప్రపంచ క్రికెట్లో ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లకున్న అసలు సమస్య ఏంటో గుర్తించాలి’ అని శాస్త్రి పేర్కొన్నాడు. కాగా, శాస్త్రి మాటలతో ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఏకీభవించాడు. రవిశాస్త్రి వందశాతం నిజం చెప్పాడన్నాడు. ‘కోహ్లీ గతకొన్నేళ్లుగా చాలా విషయాలపై దృష్టిసారించాల్సి వచ్చింది. అతడు కొద్ది కాలం తన బూట్లకు విరామం పలకాలి. సామాజిక మాధ్యమాలు కూడా వాడకుండా ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా గడపాలి. నూతనోత్సాహంతో మళ్లీ తిరిగి రావాలి. అప్పుడు జట్టులో చేరి మరింత గొప్పగా రాణిస్తాడు’ అని పీటర్సన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ