Virat Kohli: కోహ్లీతో పెట్టుకోవద్దు.. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్: రవిశాస్త్రి
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్ అందుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్ అందుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. విరాట్ తన ఆటతో విమర్శకులందరికి సమాధానం చెప్పాడన్నాడు. గతరాత్రి గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ (73; 54 బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడి అందర్నీ అలరించిన సంగతి తెలిసిందే. చూడచక్కని షాట్లతో గుజరాత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన అతడు క్రీజులోనూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రపంచానికి చాటిచెప్పాడని శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
‘కోహ్లీ ఏంటో నిరూపించుకున్నాడు. అదృష్టంకొద్దీ బెంగళూరు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి అతడి ఆటను చూడొచ్చు. ఒకవేళ దిల్లీతో వెనుకబడితే మనమంతా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ ఆటతో కేవలం తన విమర్శకులకే కాకుండా ప్రపంచానికి కూడా తనతో పెట్టుకోవద్దని చాటి చెప్పాడు. ఆటలో సత్తా ఉంటే కుర్రాళ్లు ఎలా ఆడాలో అదే నేర్పిస్తుంది’ అని ఓ క్రీడా ఛానల్తో అన్నాడు. కాగా, ఇటీవలే కోహ్లీ ప్రదర్శనపై స్పందించిన రవిశాస్త్రి కొంత కాలం అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అయితే, ఇదే విషయాన్ని విరాట్ కూడా తాజాగా ప్రస్తావించాడు. గుజరాత్తో మ్యాచ్కు ముందు హర్భజన్సింగ్తో మాట్లాడిన సందర్భంగా శాస్త్రి చేసిన వ్యాఖ్యలను విరాట్ గుర్తుచేసుకున్నాడు. తనను రవిశాస్త్రి చాలా దగ్గరి నుంచి చూశాడని, ఆయన మాటలను పరిగణనలోకి తీసుకొని విశ్రాంతి తీసుకునేందుకు ఆలోచిస్తానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!