నకిలీ ఆర్సీలతో యాజమాన్య హక్కుల మార్పిడి
వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ (ఆర్సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్...
భద్రాద్రి-కొత్తగూడెం కేంద్రంగా దందా
ఆరుగురి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్, శంషాబాద్, న్యూస్టుడే: వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ (ఆర్సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వివరాలు వెల్లడించారు. అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు చమన్ సతీష్, షేక్ జహంగీర్బాష, కె.చంద్రశేఖర్, ఎం.గణేశ్, సయ్యద్ హుస్సేన్, సీహెచ్.రమేశ్, సంపత్ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తయారు చేసి వాహన యజమానులకు 9 నెలలుగా విక్రయించేవారు.
ఎక్కడెక్కడివారో కలిసి..
చమన్ సతీష్ శంషాబాద్లోని రాళ్లగూడ నివాసి. నకిలీ ఆధార్, ఆర్సీ కార్డుల సృష్టికర్త. రాజేంద్రనగర్కు చెందిన ఎం.గణేశ్ అతడికి సహాయం చేసేవాడు. యూసుఫ్గూడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్ జహంగీర్ బాషాకు పలు రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు అధికారులతో పరిచయాలున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ లొసుగులపై అవగాహన ఉంది. సరైన పత్రాల్లేని వాహనాలకు అనుమతి పత్రాలు ఇప్పించటంలో సిద్ధహస్తుడు. కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్ సంపత్ ఇతడికి అవసరమైన ఆర్సీ కార్డులను సమకూర్చేవాడు. వివిధ కారణాల వల్ల యజమానులకు చేరని కార్డులు రవాణా శాఖ కార్యాలయానికి వెనక్కు వస్తాయి. సంపత్ కొత్తగూడెం, భద్రాద్రిలోని రవాణాశాఖ కార్యాలయాల నుంచి రోజూ 2-3 ఆర్సీ కార్డులను దొంగిలించి, ఒక్కోదాన్ని బాషాకు రూ.200-300కు విక్రయించేవాడు. సతీష్కు అమ్మేవాడు. కిషన్బాగ్కు చెందిన ఆర్టీఏ సయ్యద్ హుస్సేన్ కూడా రవాణాశాఖ కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆర్సీ కార్డులను చోరీ చేసేవాడు. వీటిని వేలంలో వాహనాలను కొనే మియాపూర్కు చెందిన సీహెచ్.రమేష్కు విక్రయించేవాడు.
పాత పేర్లు చెరిపేసి..
డీటీపీ ఆపరేటర్లుగా అనుభవం ఉన్న ఎం.గణేశ్ ఆర్సీ కార్డులపై ఉన్న పేర్లు, నంబర్లు, చిరునామాను చెరిపేసి కొత్త పేర్లను రాసేవాడు. వాటితోపాటు యాజమాన్య బదిలీకి అవసరమైన ఆధార్కార్డులను తయారు చేసి.. రూ.1000-1200 వరకూ విక్రయించేవారు. 9 నెలల వ్యవధిలో 1000 నకిలీ ఆర్సీ కార్డుల ద్వారా వాహనాల యాజమాన్య బదిలీ చేయించినట్టు గుర్తించామని ఎస్వోటీ డీసీపీ సుదీప్ తెలిపారు. ముఠా వద్ద నుంచి 900 నకిలీ ఆర్సీలు, ఖాళీ ఆర్సీ కార్డులు 3000 స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్కు తరలించారు. సంపత్ పరారీలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48గంటల పాటు ఈసీ నిషేధం
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. -
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
భాజపా కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడుతా: సీఎం రేవంత్రెడ్డి
భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోదీ, అమిత్షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్రెడ్డి
కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. -
తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
Telangana ICET | తెలంగాణలో ఐసెట్ దరఖాస్తుల గడువును మే 7 వరకు పొడిగించారు. -
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు.. బరిలో 525 మంది: సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
మెదక్ భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు: హరీశ్రావు
భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగటం సమంజసం కాదని.. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’: సీఎం రేవంత్ ఎద్దేవా
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్, భారాస ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: భాజపా ఎంపీ లక్ష్మణ్
ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు. -
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!