హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావుల ప్రమాణం

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 01 May 2024 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. అంతకుముందు వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పి.నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డిలతోపాటు న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని