40 ఏళ్లు దాటితే.. బూస్టర్ డోసు
కొవిడ్ నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమంటూ వాదనలు వినిపిస్తున్నవేళ.. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్) కీలక సిఫార్సు చేసింది. 40 ఏళ్లు దాటినవారికి ఆ డోసు అందించే అవకాశాలను
అవకాశాలను పరిశీలించొచ్చని ఇన్సాకాగ్ సిఫార్సు
ముప్పు ఎక్కువున్నవారికి ముందుగా అందించాలని సూచన
దిల్లీ: కొవిడ్ నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమంటూ వాదనలు వినిపిస్తున్నవేళ.. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్) కీలక సిఫార్సు చేసింది. 40 ఏళ్లు దాటినవారికి ఆ డోసు అందించే అవకాశాలను పరిశీలించొచ్చని సూచించింది. అందులోనూ ముప్పు ఎక్కువగా పొంచి ఉన్నవారికి తొలుత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడింది. గత నెల 29న తమ బులిటెన్లో ఇన్సాకాగ్ చేసిన ఈ సిఫార్సు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో తక్కువ స్థాయిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కు ముకుతాడు వేసే అవకాశాలు తక్కువేనని ఇన్సాకాగ్ అభిప్రాయపడింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకుండా అవి రక్షణ కల్పించగలవని పేర్కొంది. ముప్పు అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు టీకా తీసుకోనివారికి రెండు డోసుల పంపిణీని వేగంగా పూర్తిచేయాలనీ సిఫార్సు చేసింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది. అమెరికా, బ్రిటన్ మాత్రమే ఇప్పటివరకు వయోజనులకు బూస్టర్ డోసును అనుమతించాయి. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత దాన్ని తీసుకోవాలని సిఫార్సు చేశాయి.
ఒమిక్రాన్ తీవ్రత తక్కువే: కేంద్రం
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ తీవ్రత మన దేశంలో తక్కువగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. టీకాల పంపిణీ వేగంగా పూర్తవుతుండటంతో పాటు డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలోనే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడటాన్ని అందుకు కారణాలుగా పేర్కొంది.
నిపుణుల సలహా మేరకే బూస్టర్: మాండవీయ
దేశంలో వయోజనులకు బూస్టర్ డోసు, చిన్నారులకు కరోనా టీకా అందించే అంశంపై నిపుణుల శాస్త్రీయ సలహాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. కొవిడ్పై లోక్సభలో 11 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన చర్చకు ఆయన శుక్రవారం బదులిచ్చారు. ‘ముప్పు’ జాబితాలోని దేశాల నుంచి మన దేశానికి చేరుకున్న 16 వేలమందికి ఇప్పటివరకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వారిలో 18 మంది కరోనా పాజిటివ్గా తేలారని, వారి నమూనాలను జన్యు విశ్లేషణకు (ఒమిక్రాన్ నిర్ధారణ కోసం) పంపించామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, కొవిడ్ ఔషధాల అందుబాటుపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మాండవీయ విమర్శించారు. దేశీయంగా తయారైన టీకాల గురించి ప్రజల్లో అనుమానాలు సృష్టించడం ద్వారా కొవిడ్పై దేశ పోరాటాన్ని బలహీనపర్చేందుకు విపక్షాలు ప్రయత్నించాయంటూ ధ్వజమెత్తారు. భారత్లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 85% మంది తొలిడోసు, 50% మంది రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో టీకా పంపిణీ 100% పూర్తయ్యేలా ఎంపీలు చర్యలకు ఉపక్రమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, మరో 10 కోట్ల డోసులు ఈ నెలలో సమకూర్చుకోనున్నామని పేర్కొన్నారు.
దిల్లీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు
దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో 12 మంది ‘ఒమిక్రాన్’ అనుమానితులు చేరినట్లు అధికారులు తెలిపారు. వారంతా ‘ముప్పు’ జాబితాలోనే దేశాల నుంచి ఇటీవలే భారత్కు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులో 8 మందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. మిగతావారు గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు తెలిపారు.
జైపుర్లో ఒకే కుటుంబంలో 9 మందికి పాజిటివ్
నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు..
ఈనాడు, జైపుర్: రాజస్థాన్ రాజధాని జైపుర్లో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారిలో నలుగురు కొద్ది రోజుల క్రితమే దక్షిణాఫ్రికా నుంచి రావడం గమనార్హం. 9 మంది నమూనాలనూ జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?