40 ఏళ్లు దాటితే.. బూస్టర్ డోసు
కొవిడ్ నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమంటూ వాదనలు వినిపిస్తున్నవేళ.. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్) కీలక సిఫార్సు చేసింది. 40 ఏళ్లు దాటినవారికి ఆ డోసు అందించే అవకాశాలను
అవకాశాలను పరిశీలించొచ్చని ఇన్సాకాగ్ సిఫార్సు
ముప్పు ఎక్కువున్నవారికి ముందుగా అందించాలని సూచన
దిల్లీ: కొవిడ్ నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమంటూ వాదనలు వినిపిస్తున్నవేళ.. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్) కీలక సిఫార్సు చేసింది. 40 ఏళ్లు దాటినవారికి ఆ డోసు అందించే అవకాశాలను పరిశీలించొచ్చని సూచించింది. అందులోనూ ముప్పు ఎక్కువగా పొంచి ఉన్నవారికి తొలుత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడింది. గత నెల 29న తమ బులిటెన్లో ఇన్సాకాగ్ చేసిన ఈ సిఫార్సు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో తక్కువ స్థాయిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కు ముకుతాడు వేసే అవకాశాలు తక్కువేనని ఇన్సాకాగ్ అభిప్రాయపడింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకుండా అవి రక్షణ కల్పించగలవని పేర్కొంది. ముప్పు అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు టీకా తీసుకోనివారికి రెండు డోసుల పంపిణీని వేగంగా పూర్తిచేయాలనీ సిఫార్సు చేసింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది. అమెరికా, బ్రిటన్ మాత్రమే ఇప్పటివరకు వయోజనులకు బూస్టర్ డోసును అనుమతించాయి. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత దాన్ని తీసుకోవాలని సిఫార్సు చేశాయి.
ఒమిక్రాన్ తీవ్రత తక్కువే: కేంద్రం
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ తీవ్రత మన దేశంలో తక్కువగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. టీకాల పంపిణీ వేగంగా పూర్తవుతుండటంతో పాటు డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలోనే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడటాన్ని అందుకు కారణాలుగా పేర్కొంది.
నిపుణుల సలహా మేరకే బూస్టర్: మాండవీయ
దేశంలో వయోజనులకు బూస్టర్ డోసు, చిన్నారులకు కరోనా టీకా అందించే అంశంపై నిపుణుల శాస్త్రీయ సలహాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. కొవిడ్పై లోక్సభలో 11 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన చర్చకు ఆయన శుక్రవారం బదులిచ్చారు. ‘ముప్పు’ జాబితాలోని దేశాల నుంచి మన దేశానికి చేరుకున్న 16 వేలమందికి ఇప్పటివరకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వారిలో 18 మంది కరోనా పాజిటివ్గా తేలారని, వారి నమూనాలను జన్యు విశ్లేషణకు (ఒమిక్రాన్ నిర్ధారణ కోసం) పంపించామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, కొవిడ్ ఔషధాల అందుబాటుపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మాండవీయ విమర్శించారు. దేశీయంగా తయారైన టీకాల గురించి ప్రజల్లో అనుమానాలు సృష్టించడం ద్వారా కొవిడ్పై దేశ పోరాటాన్ని బలహీనపర్చేందుకు విపక్షాలు ప్రయత్నించాయంటూ ధ్వజమెత్తారు. భారత్లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 85% మంది తొలిడోసు, 50% మంది రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో టీకా పంపిణీ 100% పూర్తయ్యేలా ఎంపీలు చర్యలకు ఉపక్రమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, మరో 10 కోట్ల డోసులు ఈ నెలలో సమకూర్చుకోనున్నామని పేర్కొన్నారు.
దిల్లీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు
దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో 12 మంది ‘ఒమిక్రాన్’ అనుమానితులు చేరినట్లు అధికారులు తెలిపారు. వారంతా ‘ముప్పు’ జాబితాలోనే దేశాల నుంచి ఇటీవలే భారత్కు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులో 8 మందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. మిగతావారు గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు తెలిపారు.
జైపుర్లో ఒకే కుటుంబంలో 9 మందికి పాజిటివ్
నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు..
ఈనాడు, జైపుర్: రాజస్థాన్ రాజధాని జైపుర్లో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారిలో నలుగురు కొద్ది రోజుల క్రితమే దక్షిణాఫ్రికా నుంచి రావడం గమనార్హం. 9 మంది నమూనాలనూ జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి