గ్రూప్-2 ఆబ్కారీ ఎస్సైల నిరీక్షణకు తెర
గ్రూప్-2 ద్వారా ఎంపికైన ఎక్సైజ్ ఎస్సైల పోస్టింగ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఇప్పటివరకు తాత్కాలిక అటాచ్మెంట్లు, అకాడమీలో వెయిటింగ్లతో కొనసాగుతున్న వీరి ఇక్కట్లకు ఉన్నతాధికారులు
రెండేళ్ల తర్వాత పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-2 ద్వారా ఎంపికైన ఎక్సైజ్ ఎస్సైల పోస్టింగ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఇప్పటివరకు తాత్కాలిక అటాచ్మెంట్లు, అకాడమీలో వెయిటింగ్లతో కొనసాగుతున్న వీరి ఇక్కట్లకు ఉన్నతాధికారులు ముగింపు పలికారు. పోస్టింగ్లు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 2020 జనవరి 22న విధుల్లో చేరిన ఈ 280 మంది ఎస్సైలకు ఇప్పటివరకు శాశ్వత పోస్టింగులు లేకపోవడం గమనార్హం. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు అడ్హాక్ ఎస్సైల రూపంలో ఇన్నాళ్లూ అడ్డంకులు ఎదురయ్యాయి. వీరు ఎంపిక కాకముందున్న ఖాళీ స్థానాల్ని భర్తీ చేసేందుకు గతంలోనే ఎక్సైజ్శాఖ అడ్హాక్ పదోన్నతులను తెర పైకి తెచ్చింది. అప్పటివరకున్న కింది స్థాయి ఉద్యోగులకు అడ్హాక్ ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించింది. భవిష్యత్తులో నేరుగా ఎంపికైన ఎస్సైలొస్తే తిరిగి రివర్షన్(వెనక్కి) వెళ్తామనే షరతుతోనే వీరికి పదోన్నతులు దక్కాయి. అయితే 2020లో గ్రూపు-2 ఎస్సైలు విధుల్లో చేరినా పలు కారణాలతో అడ్హాక్ ఎస్సైలను వెనక్కి పంపలేదు. అంతేకాక నేరుగా ఎంపికైన ఎస్సైలనే సూపర్న్యూమరరీ పోస్టింగ్ల్లో చేర్చారు. అవీ చాలినన్ని లేకపోవడంతో 73 మంది గ్రూప్-2 ఎస్సైలను అకాడమీలోనే కూర్చోబెట్టారు. వీరిలోనూ 50 మంది వరకు మహిళా ఎస్సైలే. 2021 జనవరితో ఈ పోస్టుల గడువు ముగియడంతో దాదాపు పది నెలలపాటు వీరికి వేతనాలు సైతం రాలేదు. దీనికితోడు ఎక్సైజ్ ఠాణాల్లో తాత్కాలిక అటాచ్మెంట్లు పొందిన మిగిలిన గ్రూప్-2 ఎస్సైలకు ఎఫ్ఐఆర్ జారీచేసే అధికారమూ లేకుండా పోయింది. తమ దుస్థితిపై 280 మంది ఎస్సైలు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. చివరకు శనివారం నాటితో ఈ నిరీక్షణకు తెరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు