Aadhaar-Voter ID Link:ఓటుకు.. ఆధార్ లంకె
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ‘ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021’ని లోక్సభ సోమవారం 25 నిమిషాల్లోనే ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టిన బిల్లును మధ్యాహ్నం 2.46 నిమిషాలకు చర్చకు స్వీకరించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్భాయ్ సోలంకి ప్రతిపక్ష సభ్యులకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తూ వేగంగా చర్చను నడిపించి 3.11 గంటల కల్లా ముగించి, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
తప్పనిసరి కాదు.. స్వచ్ఛందమే
బిల్లుకు 25 నిమిషాల్లో లోక్సభ సమ్మతి
స్థాయీ సంఘానికి పంపాలన్న ప్రతిపక్షాలు
ఆ కమిటీ ఇదివరకే ఆమోదించిందన్న న్యాయ మంత్రి
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతున్న న్యాయశాఖ మంత్రి రిజిజు
ఈనాడు, దిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ‘ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021’ని లోక్సభ సోమవారం 25 నిమిషాల్లోనే ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టిన బిల్లును మధ్యాహ్నం 2.46 నిమిషాలకు చర్చకు స్వీకరించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్భాయ్ సోలంకి ప్రతిపక్ష సభ్యులకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తూ వేగంగా చర్చను నడిపించి 3.11 గంటల కల్లా ముగించి, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
లోపాలున్నాయి.. అందుకే సవరణలు
తొలుత మంత్రి రిజిజు మాట్లాడుతూ- ఇప్పటివరకు ఉన్న చట్టంలో కొన్ని లోపాలు, తేడాలున్నాయన్నారు. వాటిని సరిదిద్దడానికే సవరణలు ప్రతిపాదించినట్లు చెప్పారు. ‘‘ఎన్నికల సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని సవరణలు చేస్తున్నాం. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటినా కొందరు ఓటు వేయలేని పరిస్థితి ఉంది. ఏటా జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకోవడం దానికి కారణం. ఆ తర్వాత 18 ఏళ్లు నిండినవారు ఆ ఏడాదిలో ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఉండదు. ఆ లోపాన్ని సరిదిద్ది జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1ని పరిగణనలో తీసుకునే తేదీలుగా చేర్చాం. దీంతోపాటు- ఇకపై మహిళా సర్వీసు ఓటరు భర్త కూడా భార్య పనిచేసే చోట ఓటు వేయవచ్చు. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రాంగణ వివరణను మరింత విస్తరించాం. ఆధార్ కార్డును ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే నిబంధన స్వచ్ఛందమే’’ అని వివరించారు. విపక్షాల విమర్శల్లో ఎలాంటి పసా లేదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తీ ఒక నియోజకవర్గానికి మించి ఓటరుగా నమోదు కాకూడదని పేర్కొన్నారు. ఓటరు జాబితాతో ఆధార్ను అనుసంధానం చేయడం చట్టవ్యతిరేకమేమీ కాదన్నారు. ఓటరుగా పేరు నమోదు చేయడానికి ముందు గుర్తింపుగా ఆధార్ను సమర్పించాలని సంబంధిత అధికారులు అడగాల్సి ఉంటుందని చెప్పారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్న వాదన సరికాదన్నారు. ఆధార్పై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లు ఉందని తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా ఆధార్ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ లేదనే కారణంతో దరఖాస్తుల్ని తిరస్కరించడానికి వీలుండదు. అలాంటివారు ఇతర ధ్రువపత్రాలను సమర్పించే వెసులుబాటు ఉంది.
లోక్సభలో ఆందోళన చేస్తున్న విపక్షాల సభ్యులు
ఇంత అత్యవసరం ఏముంది?: కాంగ్రెస్
కాంగ్రెస్ పక్షనేత అధీర్రంజన్ చౌధరి మాట్లాడుతూ- బిల్లు మహత్తరమైతే అత్యవసరంగా నిమిషాల వ్యవధిలో ఆమోదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం లేకుండా ఈ బిల్లును తీసుకురావడమేమిటన్నారు. అదే పార్టీకి చెందిన మనీశ్ తివారీ మాట్లాడుతూ ఓటు హక్కు అన్నది పౌరులకు చట్టపరంగా లభించిన అధికారమని, దానికి ఆధార్తో లంకె పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మరో సభ్యుడు శశి థరూర్ ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రతిపాదన వల్ల.. పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డీఎంకే సభాపక్షనేత టీఆర్ బాలు మాట్లాడుతూ స్థాయీసంఘం పరిశీలన తర్వాత దీన్ని పరిశీలనకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, బీఎస్పీ, ఆర్ఎస్పీ సభ్యులు ఇదే తరహా డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు భాగస్వాములుగా ఉన్న స్థాయీసంఘం సిఫార్సుల మేరకే బిల్లు తీసుకువచ్చినట్లు రిజిజు చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రాంగణాన్ని అయినా తీసుకొనేలా సవరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. భాజపా సభ్యుడు నిషికాంత్ దూబే మాట్లాడుతూ- ఓటరు జాబితాతో ఆధార్ను అనుసంధానిస్తే నేపాలీ, బంగ్లాదేశీయులను మనదేశంలో ఓటర్లుగా చేయడం కుదరదనీ, అందుకే కాంగ్రెస్, టీఎంసీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
* ఈ బిల్లు చట్టంగా మారితే ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం ద్వారా ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందడానికి అధికార పక్షం చేసే ప్రయత్నాలను విపక్షం ఉమ్మడిగా అడ్డుకోవాలని సీపీఎం పొలిట్బ్యూరో పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?