CM KCR: పెడ ధోరణిలో కేంద్రం
ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు
రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోంది
ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడ చదివిస్తాం..ఖర్చు భరిస్తాం
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి వేతనాలు
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగాలు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.3 వేలకు పెంపు
వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం
వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తాం
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాబోతోంది.
బడ్జెట్ అనేది ప్రజాధనం. ఓట్లు, సీట్లకే పరిమితమైతే అరాచకం అవుతుంది. ఇటీవల కొందరు పిగ్మీలు దూరిపోయి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా చేస్తున్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వంపై నిందలు మోపి భాజపా వచ్చింది. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు భాజపా పాలనలో దేశం పతనం అయింది. ఆనాడు 8 శాతంగా ఉన్న వృద్ధిరేటు నేడు ఆరుకి పడిపోయింది’’ -సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్ : ‘‘రాష్ట్రాల సమాఖ్య అనేది రాజ్యాంగంలో కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోంది. కేంద్రం విధానం విచిత్రంగా ఉంది. బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రం అనే విధానాన్ని అవలంబిస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య. ఈ పెడధోరణి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుంది. కచ్చితంగా వాంఛనీయం కాదు. కేంద్రం తీరుపై అన్ని శాసనసభలు చర్చించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్ పద్దులపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన నాలుగురోజుల విశ్రాంతి అనంతరం శాసనసభకు హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో వివిధవర్గాలకు పలు వరాలు ప్రకటించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన తర్వాత అక్కడే పదవీవిరమణ పొందుతారు. వారు ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కొందరైతే ఆ రాష్ట్రంతో భావోద్వేగ బంధం ఏర్పర్చుకుంటారు. అలాంటి అధికారుల్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటామని కేంద్రం కుట్ర చేస్తోంది. అఖిలభారత సర్వీస్ అధికారుల్ని అభద్రతకు లోనుచేస్తోంది. ఈ విషయంలో మీ గొంతు కోస్తామని రాష్ట్రాలనే అభిప్రాయం అడుగుతోంది.
కేంద్రం పనితీరు దిగజారింది
కేంద్రం పనితీరు దిగజారిందని ఆ ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. నేటికి కేంద్రం రూ.152 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్లో 25శాతం మాత్రమే అప్పులు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. కేంద్రం అదే నీతిని పాటించాలి కదా? కానీ 58.5 శాతం అప్పు చేసింది. తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి వంటి అంశాల్లో కేంద్రం పనితీరు తెలంగాణ స్థాయిలో లేదు. అప్పుల్లో తెలంగాణాది దేశంలో 24వ స్థానం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అప్పుల వాయిదాలు ఎప్పటికప్పుడు పక్కాగా చెల్లిస్తున్నాం. ఆర్బీఐ నివేదికలే తెలంగాణ పథకాల్ని మెచ్చుకుంటున్నాయి. అవినీతిని అణచివేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. బడ్జెట్ బాగాలేకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు.
సభలో సీఎం వివిధ వర్గాల వారికి ప్రకటించిన వరాలు
* ఉక్రెయిన్లో 20 వేల పైచిలుకు విద్యార్థులు చిక్కుకున్నారు. తెలంగాణ నుంచే వారిలో 740 మంది ఉంటే వీరిలో 710 మంది ఎంబీబీఎస్ చదవడానికే వెళ్లారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలంటే రూ.కోటికిపైగా ఖర్చవుతున్నందున అంత భరించలేక పలువురు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకే ఉక్రెయిన్లో చదవడానికి వెళుతున్నారు. యుద్ధం వల్ల విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్కు పోయే పరిస్థితి లేదు. వారి చదువు ఇక్కడ కొనసాగించే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రాస్తాం. వారి చదువుకు ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యుద్ధం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్లో ఇబ్బందులు పడుతుంటే కొందరు కేంద్రమంత్రులు వారిని విమర్శిస్తూ ‘తిన్నది అరగక అక్కడికి ఎందుకు పోయారు’ అని మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ? దీనిపై మేం ఏమైనా మాట్లాడితే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు.
* సెర్ప్, మెప్మాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం.
* ఉపాధి హామీ పథకం విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారు గతంలో సమ్మె చేశారు. భ్రమలకు పోయి సమ్మె చేయవద్దని అప్పుడే చెప్పాం. అయినా వినకుండా సమ్మె చేశారు. వాళ్ల మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? వాళ్లందరినీ మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకుంటాం.
* ఉద్యోగాలకు పోటీ పరీక్షలన్నింటినీ ఉర్దూ భాషలో కూడా నిర్వహిస్తాం.
* పబ్లిక్ సర్వీసు కమిషన్లో మైనార్టీ వర్గానికి చెందినవారిని సభ్యుడిగా నియమిస్తాం.
* తెలంగాణ ఏర్పడినప్పుడు 3 వైద్య కళాశాలలుంటే ఇప్పుడు 33కి పెంచుతున్నాం. ప్రతీ కాలేజీలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటుచేస్తాం
* వరంగల్, మంథని, ఖమ్మం, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆ రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి పంపితే పరిహారం ఇస్తాం.
* పాతబస్తీలో రోడ్లు వెడల్పు చేయడానికి మరో రూ.200 కోట్లు ఇస్తాం.
* మధ్యాహ్న భోజన పథకం విభాగంలో పనిచేస్తున్నవారికి ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. దానిని రూ.3 వేలకు పెంచుతాం.
* గ్రామ రెవెన్యూ సహాయకులను నీటిపారుదలశాఖలో లష్కర్లుగా నియమిస్తాం.
* సాదాబైనామాల వారి భూముల వివరాలను ధరణిలో నమోదుకు చర్యలు తీసుకుంటాం.
* నీటిపారుదల, వైద్యశాఖల్లో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులిస్తాం.
డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్
ప్రస్తుత మోదీ పాలనలో 5 లక్షల సంస్థలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు యూపీఏ హయాంలో 4.7 శాతముంటే ఇప్పుడు 7.11కి పెరిగింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ర్యాంకుల్లో భారత్ 93కి చేరింది. ఆత్మనిర్భర్ అన్నారు. దేశం ఆత్మనిబ్బరం కోల్పోయింది. మతపిచ్చి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఇలాంటి కేంద్ర పాలన వల్ల దశాబ్దాల తరబడి ప్రగతికి కొనసాగిన కృషి కుప్పకూలుతుంది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ అని కొందరు కొత్త నినాదంతో ప్రచారం చేస్తున్నారు.ప్రజలు అమాయకులు కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితి ఉంది. కానీ అది ట్రబుల్ ఇంజిన్ అని సభ్యులు అంటున్నారు. కేంద్రంలో, ఉత్తర్ప్రదేశ్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా అనేక అంశాల్లో తెలంగాణకన్నా వెనుకబడి ఉంది.తలసరి ఆదాయంలో సిక్కిం తరవాత దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
111 జీఓను రద్దు చేస్తాం
గతంలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీరు వచ్చేది. అవి కలుషితం కాకుండా ఉండటానికి 7 మండలాల్లోని 83 గ్రామాల్లో భూముల వినియోగంపై అంక్షలు పెడుతూ 111 జీఓ తెచ్చారు. కానీ వాటి నుంచి ఇప్పుడు మంచినీరు నగరానికి అవసరం లేదు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీరు నగరానికి వస్తుంది. హైదరాబాద్కు వందేళ్ల వరకు నీటి సమస్య రాదు. ఈ నేపథ్యంలో 111 జీవో అర్థరహితం. దానిని ఒకేసారి రద్దుచేస్తే ఇబ్బందులు రాకుండా అక్కడ గ్రీన్జోన్లు ఏర్పాటుచేసేలా మున్సిపల్ శాఖ చూడాలి. ఈ జీఓ రద్దుపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశాం. నివేదిక రాగానే జీఓను ఎత్తేస్తాం.
* ఐఏఎస్ అధికారుల కమిటీ నివేదిక అందగానే మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని ఆలయభూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
* ఎమ్మెల్యేలు, అధికారులు, విలేకరులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. అది తేలగానే వారికి స్థలాలిస్తాం.
* ఏపీ, తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి నదీ జలాలను ఇతర నదులతో అనుసంధానం చేసి జలాలను తరలించే అవకాశం లేదు. సీతారామసాగర్ పూర్తయితే ఖమ్మం జిల్లాలో పుష్కలంగా నీరు అందుతుంది.
భట్టిని పార్లమెంట్కు పంపిద్దాం
ఎప్పుడూ మాపై విమర్శలు చేస్తారని భట్టి విక్రమార్కకు పేరుంది. కేంద్రప్రభుత్వం తీరుపై బాగా విమర్శలు చేస్తుండటంతో మా సభ్యులంతా ఆయన పార్లమెంట్లో మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు కేంద్రంపై కోపాన్ని శాసనసభలో చూపితే ఎలా అంటున్నారు. పార్లమెంట్కు వెళ్లి నిలదీయాలని కోరుతున్నారు. దిల్లీకి వెళ్లడం అంటే ప్రమోషనే. డిమోషన్ కాదు. తెలంగాణ అప్పుల్లో ఉందనే బెంగ భట్టి విక్రమార్కకు అవసరం లేదు. - ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్