ఎన్నికల వేళ వేతనాల పెంపా?
ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టినట్లు తెలిసింది. మున్సిపల్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం
ఇది నియమావళి అతిక్రమణే
మున్సిపల్ అధికారులను తప్పుబట్టిన ఈసీ
ఈనాడు, హైదరాబాద్ : ఎన్నికల వేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టినట్లు తెలిసింది. మున్సిపల్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో 12 మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 9న షెడ్యూల్ను ప్రకటించింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ అదే నెల 18న రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా మండలి స్థానాలకు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయటంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ఆ ఉత్తర్వులు వాస్తవమా? కాదా? తెలపాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అయితే జారీ అయిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల ఉత్తర్వులను రద్దు చేసింది. ఉత్తర్వుల జారీ, రద్దు వ్యవహారాలపై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్కు పంపిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, కార్యదర్శి సి.సుదర్శన్రెడ్డిలకు లిఖిత పూర్వకంగా హెచ్చరికలు జారీ చేయటంతోపాటు.. సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. గౌరవ వేతనం పెంపుదల ఉత్తర్వులు జారీ చేయటం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించటమేనని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్రమే
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
దండకారణ్యం ‘కోట’కు బీటలు!
మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్