కొలువులో ‘పాతుకుపోయారు’
ఔషధ నియంత్రణాధికారి(డ్రగ్ ఇన్స్పెక్టర్)గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోనే కొలువు. 10 ఏళ్లు గడుస్తున్నా మరోచోటుకు బదిలీ కాలేదు. ఇక్కడే పదోన్నతి కూడా పొందారు. తన డివిజన్ పరిధిలోని అన్ని ఔషధ దుకాణదారులతో
ఔషధ నియంత్రణాధికారులుగా ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగం
మందుల దుకాణాలతో సన్నిహిత సంబంధాలు
క్రమం తప్పని ముడుపులు...తూతూమంత్రంగా తనిఖీలు
ఫుడ్ ఇన్స్పెక్టర్లదీ ఇదే తీరు
ఈనాడు, హైదరాబాద్
ఔషధ నియంత్రణాధికారి(డ్రగ్ ఇన్స్పెక్టర్)గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోనే కొలువు. 10 ఏళ్లు గడుస్తున్నా మరోచోటుకు బదిలీ కాలేదు. ఇక్కడే పదోన్నతి కూడా పొందారు. తన డివిజన్ పరిధిలోని అన్ని ఔషధ దుకాణదారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో దుకాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నెలనెలా తనిఖీలకు వెళ్లినప్పుడు తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా క్రమం తప్పకుండా ముడుపులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి పెరిగిపోవడం, కొందరిపై నేరుగా ఫిర్యాదులు రావడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల సమీక్షలో ఆ శాఖ మంత్రి హరీశ్రావు కూడా ఇదే విషయంపై ఆరా తీసినట్లుగా తెలిసింది. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తుండడం శ్రేయస్కరం కాదని, వెంటనే అటువంటి వారిని బదిలీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లపైనా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయని, వారికీ ఇవే ఆదేశాలు వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
నిబంధనలు పాటించకపోయినా.. పట్టించుకోరు
* ఔషధ ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహిస్తుండాలి.
* ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టు సమక్షంలోనే మందులు ఇవ్వాలి.
* వైద్యుల చీటి లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్1 ఔషధాలను విక్రయించడానికి వీల్లేదు.
* ఔషధ అమ్మకం ప్రతినిధులు ఇచ్చే నమూనా(శాంపిల్) మందులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు.
* మత్తు ఔషధాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే.. తక్షణమే చర్య తీసుకోవాలి.
* అయితే ఈ నిబంధనల్లో అత్యధికం పాటించకపోయినా.. డ్రగ్ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుడ్ ఇన్స్పెక్టర్లపైనా ఫిర్యాదులు
* ప్రతి ఆహార విక్రయ దుకాణానికి అనుమతి ఉండాలి. వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా, హోటళ్లలో వాడే వస్తువులు నాణ్యయంగా ఉండాలి. వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయాలి
* మరీ నాణ్యత లోపం కనిపిస్తే ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయాలి.
* అయితే క్షేత్రస్థాయిలో అత్యధిక సందర్భాల్లో ఇవేవీ జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇక నుంచి పనితీరే ప్రామాణికం
దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రధానంగా ముడిసరకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు రాష్ట్రంలో ఎక్కువ. ఔషధాల నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యత డ్రగ్ ఇన్స్పెక్టర్లదే. ఒకవైపు ఉత్పత్తి సంస్థల్లో నిరంతరం తనిఖీలు జరుపుతూ.. నాణ్యమైన ఔషధాలు ఉత్పత్తి అయ్యేలా చూడడం ప్రధాన విధి కాగా.. మరోవైపు బహిరంగ విపణిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించే బాధ్యత కీలకమైంది. 2014-16లో వచ్చిన ‘జాతీయ ఔషధ సర్వే’ ప్రకారం.. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని తేలింది. ఇదే క్రమంలో సర్కారు వైద్యంలో అయితే 12.57 శాతం ఔషధాల్లో ప్రమాణాలు కొరవడినట్లుగా ఆ సర్వే నివేదిక స్పష్టం చేసింది. అందుకే ఇక నుంచి పనితీరే ప్రామాణికంగా పరిగణిస్తామని వైద్య మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తాజా పరిశీలనలో 9 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారు ఔషధ నియంత్రణ సంస్థలో 50 మందికి పైగా ఉన్నట్లుగా గుర్తించారు. ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేశారు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇదే విషయంపై కసరత్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం