రథసప్తమికి ప్రత్యేక బస్సులు

రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

Published : 27 Jan 2023 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్యంకొండ, గూడెంలోని పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు ఉంటాయని వారు వివరించారు. ‘కరీంనగర్‌ నుంచి వేములవాడ, ధర్మపురికి 10 చొప్పున, నల్గొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబూబ్‌నగర్‌ నుంచి మన్యంకొండకు 10, ఆదిలాబాద్‌ నుంచి గూడేనికి 5, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 బస్సులు నడుపుతాం. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి, చిలుకూరు బాలాజీ మందిరం, సికింద్రాబాద్‌ మహంకాళి, హిమాయత్‌నగర్‌ బాలాజీ తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని