రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కరవు
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, ఇది దురదృష్టకరమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
గన్ఫౌండ్రి, హిమాయత్నగర్, న్యూస్టుడే: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, ఇది దురదృష్టకరమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని విమర్శించే ముందు.. కేంద్రం విడుదలచేసిన నిధుల లెక్కలను పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు సూచించారు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రూ.29,581 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 39 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. తెలంగాణలో రెండు రైల్వే ఎక్స్లెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్లో రూ.521 కోట్లు కేటాయించామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను ఇచ్చిందని తెలిపారు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కేంద్రం రూ.600 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 20 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లనూ ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం-ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సైతం ప్రతిపాదనలు పంపలేదని, భద్రాచలం వరకు రైల్వేలైన్ పొడిగింపు డీపీఆర్ పెండింగ్లో ఉందని సమాధానమిచ్చారు.
భారాస దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి...: తెలంగాణలో అనేక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని భారాస ప్రభుత్వం మాత్రం తమపై తరచూ విమర్శలు చేస్తోందని, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని భాజపా శ్రేణులకు సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తదితరులు కలిశారు. కేంద్ర బడ్జెట్పై ఈ నెల 12వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎస్.ప్రకాశ్రెడ్డి, పాల్వాయి రజనీ, సంగప్పలతో ఓ కమిటీని సైతం ఏర్పాటుచేశారు.
* శనివారం సాయంత్రం సోమాజిగూడలోని కత్రియా హోటల్లో నిర్వహించిన కేంద్ర బడ్జెట్పై మేధావుల సదస్సులో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వందే భారత్ తరహాలో వంద కిలోమీటర్లలోపు నగరాల మధ్య ‘వందే మెట్రో’ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. రాబోయే 16 నెలల్లో దీనికి సంబంధించిన డిజైన్, ఇతర ప్రక్రియలతో పాటు ట్రయల్ రన్ పూర్తిచేస్తామన్నారు.
కవచ్పై సమీక్ష...
ఈనాడు, హైదరాబాద్ : ఒకే ట్రాక్పై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీకొనకుండా నివారించే కవచ్ వ్యవస్థ పనితీరుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్షించారు. హైదరాబాద్కు శనివారం వచ్చిన మంత్రి ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ (ఇరిసెట్)ని సందర్శించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న 170 మంది ఇంజినీర్లతో మంత్రి సంభాషించారు. ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ సుధీర్కుమార్ మంత్రి వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం