అది.. ‘మనీ’ కేటగిరీ!
వేలం ఒక్కటే తక్కువ... ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే బీటెక్ సీట్లు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల అమ్మకాల పరిస్థితి ఇదీ.
బీటెక్లో జోరుగా బీ-కేటగిరీ సీట్ల అమ్మకాలు
‘యాజమాన్య’ దోపిడీ రూ.800 కోట్లుగా అంచనా
ప్రతిభను పక్కనబెట్టి డబ్బులిచ్చినోళ్లకే అవకాశం
ఏటా హెచ్చరికలకే ఉన్నత విద్యామండలి పరిమితం
ఈనాడు - హైదరాబాద్
వేలం ఒక్కటే తక్కువ... ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే బీటెక్ సీట్లు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల అమ్మకాల పరిస్థితి ఇదీ. ప్రతి సంవత్సరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్లు అంచనా. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలవకుండానే అప్పుడే అనేక కళాశాలల్లో సీట్ల విక్రయాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని బీటెక్ సీట్లలో 70% కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. మిగిలిన 30 శాతాన్ని బీ-కేటగిరీగా పిలుస్తారు. వాటిని కళాశాలల యాజమాన్యాలే నింపుకొంటాయి. అందులోనూ సగం సీట్లను జేఈఈ మెయిన్/ఎంసెట్ ర్యాంకులు, చివరగా ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. మిగిలిన సగం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. వాటికి ఏడాదికి 5వేల అమెరికన్ డాలర్లు (రూ.4.12 లక్షలు) ఫీజుగా తీసుకోవాలి. ఈ కోటాలో చేరేందుకు ఎవరూ రాకుంటే వాటిని కూడా యాజమాన్య కోటాలోకి మార్చి భర్తీ చేయాలి. కేవలం మూడు, నాలుగు కళాశాలలు మాత్రమే యాజమాన్య కోటాలో సగం సీట్లను మెరిట్ ఆధారంగా ఇస్తున్నాయి. జేఈఈ మెయిన్లో ఉత్తీర్ణులై, మంచి స్కోర్ సాధించిన విద్యార్థులకు వాటిలో సీట్లు దక్కుతున్నాయి. కానీ... రాష్ట్రంలో 95 శాతానికి పైగా కళాశాలలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాలపట్టిక ప్రకటిస్తేనే మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులను స్వీకరించాల్సి ఉన్నా... అందుకు భిన్నంగా జరుగుతోంది.
20 వేల మంది చేరిక
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్ కోటాలో 80 వేలు, యాజమాన్య కోటాలో 30 వేల సీట్లు ఉంటాయి. మొత్తం మీద 75 వేల మంది బీటెక్లో చేరుతుండగా... అందులో మేనేజ్మెంట్ కోటా కింద ప్రవేశాలు పొందేవారు 20 వేల వరకు ఉంటున్నారు. గతంలో ఆ సంఖ్య 16 వేలే ఉండేది. రెండేళ్లుగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత బ్రాంచి సీట్లు పెరగడంతో వాటికి విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగింది. సగటున ఒక్కో సీటుకు రూ.5 లక్షలు అనుకున్నా 20 వేల మంది నుంచి రూ.వెయ్యి కోట్ల దోపిడీ సాగుతోంది. కనిష్ఠంగా రూ.4 లక్షలు అనుకున్నా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని నగదు రూపంలోనే తీసుకుంటున్నారు.
కట్టడి చేసే దిశగా చర్యలు శూన్యం
30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా కోర్టు తీర్పులున్న మాట వాస్తవమే. కానీ... ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. జేఈఈ మెయిన్లో మంచి స్కోర్ పొందిన వారు సైతం ఎక్కడ తమకు సీట్లు దక్కవేమోనని అప్పులు తెచ్చి మరీ సీట్లు కొనుక్కుంటున్నారు. కళాశాలల యాజమాన్యాల్లో అన్ని రాజకీయ పార్టీల వారు ఉండటంతో ప్రభుత్వం సైతం కట్టడికి కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2023-24) మేనేజ్మెంట్ కోటా దోపిడీకి చెక్ పెడతామని నిరుడు ఉన్నత విద్యామండలి చెప్పినా... ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు శూన్యం. యాజమాన్యాల దోపిడీపై ప్రతియేటా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా శాశ్వత పరిష్కారానికి ఉన్నత విద్యామండలి చొరవ తీసుకున్న దాఖలా లేదు. కనీసం గత విద్యా సంవత్సరం యాజమాన్య కోటా కింద భర్తీ అయిన సీట్ల సంఖ్యను కూడా ఇప్పటివరకు బయటపెట్టకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం