బలగం రాకముందే..!
ఎక్కడైనా సరే అందుబాటులోని పోస్టుల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. కానీ ఆ విభాగం మాత్రం అందుకు భిన్నం. భవిష్యత్తులో రాబోయే పోస్టులను ఊహించుకొని ముందస్తుగానే పదోన్నతులిచ్చేసుకుంది.
కొత్త పోస్టులను ఊహించుకుని పదోన్నతులిచ్చారు
తీరా 1203 పోస్టుల నియామకాలకు తిరస్కరణతో సందిగ్ధం
తెలంగాణ ప్రత్యేక భద్రత దళంలో విచిత్ర పరిణామాలు
ఈనాడు, హైదరాబాద్: ఎక్కడైనా సరే అందుబాటులోని పోస్టుల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. కానీ ఆ విభాగం మాత్రం అందుకు భిన్నం. భవిష్యత్తులో రాబోయే పోస్టులను ఊహించుకొని ముందస్తుగానే పదోన్నతులిచ్చేసుకుంది. ఈ తొందరపాటు చర్యే ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి చిక్కులు తెచ్చిపెడుతోంది. విధినిర్వహణలో కానిస్టేబుళ్లపై ఒత్తిడి పెరుగుతుండడం సమీప భవిష్యత్తులో వివాదాలకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక భద్రత దళం (టీఎస్ ఎస్పీఎఫ్) కేంద్ర బిందువుగా మారింది.
కొత్త పోస్టుల భర్తీకి మండలి నిరాకరణ..
టీఎస్ఎస్పీఎఫ్కు ప్రభుత్వం ఇటీవలే 1203 కొత్త పోస్టులు మంజూరుచేసింది. ప్రస్తుతం పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ జరుగుతుండడంతో కొత్త పోస్టులను భర్తీ చేయాలని ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు 5 నెలల క్రితం మండలికి లేఖరాశారు. గతేడాది జారీఅయిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే 390 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ ప్రక్రియ చూస్తున్న మండలి కొత్త పోస్టుల భర్తీకి నిరాకరించడం కీలక పరిణామంగా మారింది. ఎస్పీఎఫ్లో కొత్తగా మహిళల పోస్టులను సృష్టించడంతో పాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం అడ్డుగా నిలవడమే మండలి నిరాకరణకు కారణమైంది. ఈసారికైతే కొత్త పోస్టులను భర్తీ చేయలేమని స్పష్టంచేస్తూ మండలి ఉన్నతాధికారులు ఎస్పీఎఫ్కు తాజాగా సమాచారం పంపించారు. దీంతో మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది..? కొత్త పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయి..? అనే ప్రశ్నలకు ఇప్పుడు ఎవరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
భారమంతా వారిపైనే...
ఎస్పీఎఫ్కు కొత్తగా మంజూరైన వాటిలో తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల భద్రత పర్యవేక్షణకు 730.. జెన్కో కోసం 277.. బేగంపేట విమానాశ్రయం కోసం 114 కానిస్టేబుళ్ల పోస్టులున్నాయి. అలాగే కొత్తగా మహిళా పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 12 మంది ఎస్సైలతో పాటు 70 మంది కానిస్టేబుళ్ల పోస్టులున్నాయి. ఇవిపోను ప్రస్తుతం అన్ని కేడర్లలో సుమారు 1650 మంది ఉన్నారు. వీరిలో కానిస్టేబుళ్లు 1400 మంది ఉండేవారు. ఎస్పీఎఫ్ తొందరపాటు నిర్ణయం వల్ల 250 మంది వరకు కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. దీంతో ప్రస్తుతం ఉన్న 1150 మంది కానిస్టేబుళ్లపైనే అదనపు భారం పడుతోంది. వాస్తవానికి 2 వేల మంది అవసరం ఉంటే దాదాపు సగం మందే ఉన్నారు. .కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఎస్పీఎఫ్లో మొత్తం 3,580 పోస్టులున్నాయని లెక్కలేసుకుని పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. కానీ వాటిలో సగం పోస్టులైనా అందుబాటులో లేకపోవడం గమనార్హం. మొత్తంమీద కొత్త బలగం రాకుండానే చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ విమర్శలకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో