Sri Lanka: ‘ఈస్టర్ పేలుళ్ల’కు స్వదేశంలోనే కుట్ర..? దర్యాప్తునకు ఆదేశించిన దేశాధ్యక్షుడు
శ్రీలంక బాంబు దాడుల ఘటనలో దేశ నిఘాసంస్థ చీఫ్ సహా పలువురు ప్రభుత్వాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.
కొలంబో: శ్రీలంకను కుదిపేసిన ‘ఈస్టర్ బాంబు పేలుళ్ల (Easter Terror Attacks)’ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2019నాటి ఈ మారణహోమంలో శ్రీలంక నిఘా సంస్థ చీఫ్ సహా పలువురు ప్రభుత్వాధికారుల ప్రమేయం ఉందని బ్రిటన్కు చెందిన ‘ఛానెల్ 4’ ఇటీవల ఓ డాక్యుమెంటరీలో తీవ్ర ఆరోపణలు చేసింది. రాజపక్స సోదరులకు అనుకూలంగా బలవంతపు రాజకీయ మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దాడులకు కుట్ర పన్నినట్లు పేర్కొంది. ఇది కాస్త స్థానికంగా దుమారానికి దారితీసింది. ఈ క్రమంలోనే.. ఆరోపణలపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేస్తామంటూ దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రకటించారు.
ఈస్టర్ బాంబు పేలుళ్లకు దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ సురేశ్ సలే కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకుగానూ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని నియమించనున్నట్లు ఆదివారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దాడి అంతా కుట్రేనని మాజీ అటార్నీ జనరల్ చేసిన ఆరోపణలపైనా దర్యాప్తు చేసేందుకు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీని నియమిస్తామని విక్రమసింఘే తెలిపారు. ఈ రెండింటి నివేదికలను పార్లమెంటులో సమర్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్ ఛానెల్ చేసిన ఆరోపణలను దేశ రక్షణ శాఖ ఇప్పటికే ఖండించింది. మరోవైపు.. 2019 అధ్యక్ష ఎన్నికల్లో తాను రాజకీయ ప్రయోజనం పొందాననే ఆరోపణలను మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తోసిపుచ్చారు.
‘ఖలిస్థానీవాదం’పై మోదీ తీవ్ర ఆందోళన.. కెనడా ప్రధానితో భేటీ
2019 ఏప్రిల్ 21న ఈస్టర్ పండగనాడు లంకలో మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్ ముఠాతో సంబంధమున్న నేషనల్ తవ్హీద్ జమాత్ అనే స్థానిక ఉగ్రముఠాకు చెందిన 9 మంది ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 11 మంది భారతీయులు సహా 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లపై నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ.. వాటిని నిర్మూలించడంలో అప్పటి మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా