Ukraine: డాన్బాస్లో ఉక్రెయిన్ పతాకం రెపరెపలు.. తర్వాతి లక్ష్యం లైమన్!
ష్యాపై దండయాత్రకు పాల్పడిన పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సొంతం చేసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ యుద్ధం రష్యా చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు.
కీవ్: రష్యన్ బలగాల అదుపులో ఉన్న డాన్బాస్ నగరాన్ని తిరిగి చేజిక్కించుకున్న ఉక్రెయిన్.. తాము కోల్పోయిన మరిన్ని భూభాగాలపై పట్టుసాధించాలని ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గత శనివారం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగినట్లే గత వారం రోజులుగా డాన్బాస్ నగరంలో ఉక్రెయిన్ జెండాల రెపరెపలాడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ బలగాలు కీలక లైమన్ నగరానికి చేరుకున్నట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ తర్వాత జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యాపై దండయాత్రకు పాల్పడిన పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సొంతం చేసుకుంటామన్నారు. తెలివితక్కువ తనంతో ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. అధ్యక్ష స్థాననంలో ఉన్నంత వరకు రష్యా ఒక్కొక్కరిగా కోల్పోతూ ఉంటుందని చెప్పారు. ఈ యుద్ధం రష్యా చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని జెలెన్స్కీ పేర్కొన్నారు.
చర్చలు జరిపే ప్రసక్తే లేదు: జెలెన్ స్కీ
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పునరుద్ఘాటించారు. ఈ మేరకు అధికారిక పత్రంపై ఆయన మంగళవారం సంతకాలు చేశారు. గత శుక్రవారం ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజియా,లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తూ.. చర్చలకు రావాలని ఉక్రెయిన్కు సూచించారు. దీనిపై అప్పుడే స్పందించిన జెలెస్కీ.. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయమై తాజాగా అధికారిక పత్రంపై సంతకాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.