Ukraine Crisis: ఉక్రెయిన్ దాడుల్లో అమెరికన్ జర్నలిస్ట్ మృతి..!
ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు ‘న్యూయార్క్ టైమ్స్’కు చెందిన బ్రెంట్ రెనాడ్ అనే జర్నలిస్ట్ మృతి చెందారు.
ధ్రువీకరించిన కీవ్ అధికారులు
కీవ్: ఉక్రెయిన్లో జరుగుతోన్న భీకర పోరులో వేల మంది సైనికులతోపాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వైద్యులూ మరణిస్తున్నారనే వార్తలు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు ‘ది న్యూయార్క్ టైమ్స్’కు చెందిన బ్రెంట్ రెనాడ్ అనే జర్నలిస్ట్ మృతి చెందారు. ఐడీ, పాస్పోర్టు సాయంతో ఆయనను గుర్తించినట్లు వెల్లడించిన కీవ్ పోలీసులు.. ఈ దాడిలో మరో జర్నలిస్ట్కు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతోన్న బ్రెంట్.. పలు దేశాల్లో యుద్ధవాతావరణ సంఘటనల కవరేజీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉక్రెయిన్పై సైనిక చర్య తీవ్రతరం చేసిన రష్యా.. భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా లీవ్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన క్షిపణి దాడిలో 35 మంది చనిపోయారు. మరో 134 మందికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 30 క్షిపణులతో తమ సైనిక స్థావరంపై రష్యా సేనలు దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇలా భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ప్రపంచానికి చూపించేందుకుగానూ వందల మంది అంతర్జాతీయ జర్నలిస్టులు ఉక్రెయిన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉక్రెయిన్ అధికారుల ప్రకారం, దాదాపు 1300 మంది అంతర్జాతీయ మీడియా సిబ్బంది ఉక్రెయిన్ యుద్ధ భూమిలో కవరేజీ చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434