Bangladesh : బంగ్లాదేశ్ ప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణం..!
బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణమని తెలుస్తోంది. ఆదివారం చిట్టగాంగ్ పోర్టుకు సమీపంలోని సీతకుండ ప్రాంతంలోని
హైడ్రోజన్ పెరాక్సైడ్పై నీరుపడి పేలుడు
ఇంటర్నెట్డెస్క్: బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణమని తెలుస్తోంది. ఆదివారం చిట్టగాంగ్ పోర్టుకు సమీపంలోని సీతాకుండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంటైనర్ డిపోలో మంటలు చెలరేగి.. అనంతరం భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో మొత్తం 41 మంది మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. అంతకుముందు కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కించడంతో 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావించామన్నారు. అక్కడ కంటైనర్లలోని రసాయనాలను తెలియజేస్తూ ఉండాల్సిన లేబుల్స్లో తేడాలు భారీ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఈ డిపోలో నిల్వ చేసిన కంటైనర్లలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. కానీ, వాటిపై లేబుల్స్ వేరే విధంగా ఉన్నాయి. డిపోలో మంటలు చెలరేగగానే పెద్దసంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. వారు ఈ లేబుల్స్ను చూసి.. కంటైనర్లపై నీటిని వెదజల్లారు. మంటల్లో చిక్కుకొన్న హైడ్రోజన్ పెరాక్సైడ్పై నీరు పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ధాటికి కంటైనర్ 500 అడుగులు ఎత్తు ఎగిరిపడిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సమీపంలోని వారు కొన్ని మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించారు. వాస్తవానికి హైడ్రోజన్ పెరాక్సైడ్పై నీటికి బదులు ప్రత్యేకమైన ఫోమ్ను వెదజల్లాలి.
ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చంద్ర ముత్సుద్ది మాట్లాడుతూ.. ‘‘హైడ్రోజన్ పెరాక్సైడ్ మంటల్లో చిక్కుకుంటే దానిపై ఎట్టిపరిస్థితుల్లో నీరు పోయకూడదని మా నిబంధనల్లో ఉంది. మా సిబ్బందికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తెలియక నీటిని వెదజల్లారు. విషయం తెలిస్తే మా నీటి వాహనాన్ని కూడా లోపలకు తీసుకెళ్లం’’ అని చెప్పారు. ఆ కంటైనెర్ డిపోలో ఇప్పటికీ మంటలను పూర్తిగా ఆర్పలేదు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది.
ఈ ప్రమాదంలో 300 మంది గాయపడ్డారు. ఇంకా చాలా మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు డీఎన్ఏ నమూనాలను సరిపోల్చే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కొన్ని వారాలు పట్టొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434