Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
అంతరిక్షం (Space)లోకి వెళ్లే వ్యోమగాములు (Astronauts) తినేదంతా ప్రాసెస్ చేసిన ఆహారం మాత్రమే. అందులోనూ.. వారికి నచ్చిన ఆహారం వండుకొని తినే అవకాశం ఉండదు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెడుతూ ఈఎస్ఏ (ESA) శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం కొత్తగా ఆహారాన్ని వండుకునే పద్ధతిని కనిపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అదేంటీ.. అంతరిక్షం (Space)లో ఫ్రెంచ్ ఫ్రైస్ (French Fries) ఎలా తింటారు?అక్కడ వండుకోవడం సాధ్యం కాదు కదా! అనేగా మీ సందేహం. ఈ సమస్యకు శాస్త్రవేత్తలు ఓ పరిష్కారం కనుగొన్నారు. ఇకపై భూమ్మీద ఉండేవారు వేడి వేడిగా.. కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ను తిన్నట్లే.. అంతరిక్షంలోనూ వ్యోమగాములు (Astronauts) వాటిని వేయించుకొని తినొచ్చు. దీనికోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇకపై అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు సరికొత్త పద్ధతుల్లో ఆహార పదార్ధాలను వండుకోనున్నారు.
‘‘కొన్నిసార్లు మీకు అవసరమైన ఆహారం వండుకోవడానికి చెఫ్ల అవసరం లేకపోయినా.. శాస్త్రవేత్తల అవసరం తప్పకుండా ఉంటుంది. అందులోనూ గాలిలేని ప్రదేశంలో మీరు ఉంటే కచ్చితంగా శాస్త్రవేత్తలు అవసరం. ప్రపంచంలో ఎక్కడైనా బంగాళదుంప ముక్కలను వేయిస్తున్నారు. అలాంటిది అంతరిక్షంలో ఎందుకు వేయించకూడదు? ఇందుకోసం మేం ఓ ప్రయోగం చేపట్టాం. రెండు విమానాల్లో గురుత్వాకర్షణ లేని చోటుకి వెళ్లాం. ఒక ప్రత్యేకమైన గుండ్రంగా తిరిగే ఉపకరణంలో ఆయిల్ను బయటకు రాకుండా వేడిచేసి, అందులో బంగాళదుంప ముక్కలు వేశాం. ఆయిల్ బుడగల రూపంలో వాటి చుట్టూ చేరింది. బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ బుడగలు వాటి నుంచి వేరయ్యాయి’’అని పరిశోధనా బృందం తెలిపింది. ఈ సరికొత్త ఆవిష్కరణతో వ్యోమగాములు అంతరిక్షంలో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని నూనెలో వేయించుకుని తినవచ్చని తెలిపారు. తర్వలోనే దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి వ్యోమగాములకు అందుబాటులోకి తెస్తామని ఈఎస్ఏ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం