Europol: ఐరోపాలో ‘ఆపరేషన్ డెజర్ట్ లైట్’.. 30 టన్నుల కొకైన్ స్వాధీనం!
అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఐరోపా పోలీసులు ఉక్కుపాదం మోపారు! ఐరోపావ్యాప్తంగా మూడోవంతు కొకైన్ వ్యాపారం నిర్వహించే ఓ భారీ మాదకద్రవ్యాల నెట్వర్క్ను ఛేదించారు. ఈ క్రమంలోనే.. దుబాయ్తోపాటు వివిధ దేశాల్లో 49 మందిని అరెస్టు చేసినట్లు యూరోపోల్(Europol) సోమవారం తెలిపింది.
ది హేగ్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఐరోపా పోలీసులు ఉక్కుపాదం మోపారు! ఐరోపా వ్యాప్తంగా మూడింట ఒకవంతు కొకైన్ వ్యాపారం నిర్వహించే ఓ భారీ మాదకద్రవ్యాల నెట్వర్క్ను ఛేదించారు. ఈ క్రమంలోనే దుబాయ్తోపాటు వివిధ దేశాల్లో 49 మందిని అరెస్టు చేసినట్లు యూరోపోల్(Europol) సోమవారం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెజర్ట్ లైట్’ పేరిట నవంబర్ 8నుంచి 19వరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 30 టన్నుల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.వేల కోట్లలో ఉంటుందని అంచనా వేసింది.
‘ఐరోపాలో కొన్ని మాదకద్రవ్యాల ముఠాలు కలిసి ఒక నెట్వర్క్గా ఏర్పడ్డాయి. నిందితుల కనుసన్నల్లో ఐరోపాలోకి పెద్ద మొత్తంలో కొకైన్ దిగుమతి అవుతోంది. ఈ ఖండంలో సాగే కొకైన్ వ్యాపారంలో మూడింట ఒక వంతు నియంత్రణ ఈ నెట్వర్క్దే. ఈ క్రమంలోనే చేపట్టిన ఆపరేషన్లో భాగంగా.. దుబాయిలో నెదర్లాండ్స్, స్పెయిన్, ఫ్రాన్స్లకు చెందిన ఆరుగురు కీలక నిందితులు అరెస్టయ్యారు. స్పెయిన్లో 13 మంది, ఫ్రాన్స్లో 6గురు, బెల్జియంలో 10మంది, నెదర్లాండ్స్లో 14 మందిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే 30 టన్నులకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు’ అని యూరోపోల్ వెల్లడించింది.
నెదర్లాండ్స్కు చెందిన ఓ అనుమానితుడిని ఈ నెట్వర్క్లో అత్యంత కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు యూరోపోల్ తెలిపింది. 2020, 2021ల్లో వేల కిలోల కొకైన్ను దేశంలోకి అక్రమంగా రవాణా చేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నట్లు వెల్లడించింది. ‘నిందితులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన తీవ్ర నేరాలకు పాల్పడ్డారు. దక్షిణ అమెరికా నుంచి బెల్జియంలోని యాంట్వెర్ప్, నెదర్లాండ్స్లోని రోటర్డ్యామ్ ఓడరేవుల ద్వారా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది’ అని అని నెదర్లాండ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.