Donald Trump: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులోకి ట్రంప్.. !
ముందుగా చెప్పినట్లే 15వ తేదీన డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే రేసులో తాను కూడా ఉన్నట్లు ప్రకటించారు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి ఆయన రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కోరుతూ ప్రకటన జారీ చేశారు. మార్ ఎ లాగో ఎస్టేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ‘‘అమెరికాను మరో సారి గొప్ప ప్రకాశవంతంగా చేసేందుకు అధ్యక్షపదవికి ఈ రాత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను’’ అని ప్రకటించారు. ఆ ఎస్టేట్ కేంద్రంగా ట్రంప్ ప్రచారకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించారు.
ప్రస్తుతానికి రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు. కానీ, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలుత ఊహించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 2020లో ఎన్నికల అవకతవకల ఆరోపణల విషయంలో ట్రంప్ పక్షాన నిలిచిన చాలా మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. చాలా ముందుగానే అభ్యర్థిత్వానికి పేరు ప్రకటించి రిపబ్లికన్ల ఆమోదం పొందాలని ట్రంప్ వ్యూహం. కానీ, ఈ సారి పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డెసాంటిస్ కూడా ఉన్నారు. ట్రంప్ అభ్యర్థిత్వ ప్రకటనపై స్పందించాలని ఇండోనేషియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ను విలేకర్లు కోరగా ఆయన నిరాకరించారు. విలేకర్లు ఈ ప్రశ్న అడిగిన వెంటనే పక్కనే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ వైపు ఒక సారి చూసి.. తాను వ్యాఖ్యానించదల్చుకోలేదనే అర్థం వచ్చేట్లు మాట్లాడారు.
ట్రంప్ ఎదుట ముళ్లబాట..
ట్రంప్ తొలిసారి బరిలో దిగిన సమయంలో ఆయనకు ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు. దీంతో ఓటర్లు సరికొత్త పాలన లభిస్తుందనే ఆశలతో ఆయనకు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కొన్ని పాలసీల్లో విజయం సాధించగా.. మరికొన్నింట్లో వైఫల్యాలు ఎదుర్కొన్నారు. మౌలిక వసతుల్లో పెట్టుబడులు అనే వాగ్దానం అసలు నెరవేరలేదు. దీనికి తోడు కరోనావైరస్ సమయంలో ట్రంప్ వ్యవహారశైలి వంటివి ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇక జనవరి 6వ తేదీనాటి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఘటనలు ఆయన చరిత్రపై మచ్చగా మిగిలిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం