మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్!
అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది.
తుర్కియే ఇచ్చిన సామగ్రిని వారికే పంపించడంతో విమర్శలు
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది. అన్ని దేశాలలాగే తుర్కియేలోని భూకంప బాధితులకు పాకిస్థాన్ ఇటీవల తన వంతుగా సహాయ సామగ్రిని పంపించింది. అనంతరం ఆ సాయాన్ని చూసి ఆశ్చర్యపోవడం తుర్కియే అధికారుల వంతైంది. గతంలో పాక్కు తమ దేశం అందించిన వరద సాయాన్ని అలాగే ప్యాక్ చేసి తిరిగి తమకే పంపించిందని గుర్తించి వారు కంగుతిన్నారు. దీంతో పాక్ తీరుపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది పాకిస్థాన్లో భీకర వరదలు వచ్చినపుడు తుర్కియే సహాయక సామగ్రిని పంపింది. ఇప్పుడు అదే సామగ్రిని పాక్ మరోసారి ప్యాకింగ్ చేసి అంకారాకు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పైన కొత్త బాక్సులను ఉంచిన పాక్.. లోపల ఉన్న బాక్సులను మార్చడం మర్చిపోయింది. బయటి బాక్సులపైన.. ‘‘భూకంప బాధితుల కోసం పాకిస్థాన్ ప్రజలు పంపిన సాయం’’ అని రాసి ఉంది. లోపల ఉన్న బాక్సుల్లో మాత్రం.. ‘‘వరదల్లో అల్లాడుతున్న పాక్ ప్రజలకు సాయం అందించేందుకు తుర్కియే ప్రజలు పంపుతున్న సామగ్రి ఇది’’ అని రాసి ఉండటంతో పాక్ గుట్టు బయటపడింది. తుర్కియేకు పంపిన ఈ సాయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని తుర్కియే కాన్సులేట్ జనరల్ పాక్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చర్చనీయాంశమైన పాక్ ప్రధాని తుర్కియే పర్యటన
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తుర్కియే పర్యటన చర్చనీయాంశంగా మారింది. భూకంపం సంభవించిన రెండు రోజుల తర్వాత షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆ దేశానికి వెళ్లాలనుకున్నారు. అయితే భూకంప సహాయక చర్యల్లో తాము తీరిక లేకుండా ఉన్నందున ఆ పర్యటనను వాయిదా వేసుకోవాలని తుర్కియే ప్రభుత్వం పాక్కు సూచించింది. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో విదేశీ పర్యటనలకు వెళ్తారా? అంటూ పాక్ ప్రజలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అయినప్పటికీ.. షెహబాజ్ రెండు రోజుల క్రితం తుర్కియే వెళ్లి బాధితులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా