సంక్షిప్త వార్తలు (4)
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ.. కీలక ఐరాస భద్రతామండలి(యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి.
రష్యా చేతికి భద్రతామండలి పగ్గాలు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ.. కీలక ఐరాస భద్రతామండలి(యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా.. ఏప్రిల్ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్, అమెరికాలు దీన్ని తప్పుబట్టాయి. రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం.. ప్రపంచంలోనే ‘చెత్త జోక్’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ.. యూఎన్ఎస్సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం. దీన్ని మార్చేందుకు చట్టపరమైన మార్గాలు లేవు’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పెర్రీ వ్యాఖ్యానించారు. యూఎన్ఎస్సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఏటా రూ.కోటి జీతం.. ఖర్చు పెట్టాలంటే అయిష్టం
వాషింగ్టన్: మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఖర్చులు పోను జీతం మిగలడమే చాలామందికి కష్టంగా మారింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల టాన్నర్ ఫర్ల్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్కు అసలు డబ్బు ఖర్చు పెట్టడమంటేనే అలర్జీ అట. అందుకే ఈ వయసుకే అతడు రూ.3 కోట్లు పొదుపు చేయగలిగాడు. ఇలా దాచిన డబ్బుతో 35 ఏళ్లకే పదవీ విరమణ చేయాలన్నది టాన్నర్ ఫర్ల్ ఆలోచన. మిన్నియాపొలిస్ నగరంలో నివసించే టాన్నర్కు భార్య కూడా సరైన జోడీ దొరికింది. ఆమెకూ డబ్బు ఖర్చుపెట్టడమంటే ఇష్టముండదట. మరో ఆరేళ్లకు రిటైర్మెంటు అయ్యేనాటికి తన పొదుపును రూ.5 కోట్లకు పెంచాలని టాన్నర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జీతభత్యాల కింద ఏటా రూ.కోటి ఆదాయం ఉన్న ఈయన.. భార్య, ఓ కుమారుడితో జీవిస్తూ ఇంటి ఖర్చులు పోనూ మిగతా పొదుపు చేస్తున్నాడు. తాను పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల చిన్నతనంలోనే డబ్బు విలువ తెలిసి, ఇలా సేవింగ్స్కు అలవాటుపడినట్లు టాన్నర్ చెబుతాడు.
కెనడాలో పడవ ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతులు
టొరంటో: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నంలో సెయింట్ లారెన్స్ నదిలో పడవ మునిగి చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆక్వేసస్నే సమీపంలోని నది ఒడ్డున శుక్రవారం రెండు మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ పడవను నడిపిన కేసీ ఓక్స్(30) అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, అతడు చనిపోయాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
రోమ్: శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఎదురవ్వడంతో ఆస్పత్రిలో చేరిన క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం మెరుగవ్వడంతో శనివారం ఆస్పత్రి నుంచి వాటికన్ సిటీకి పయనమయ్యారు. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో బుధవారం పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి దగ్గర విలేకరులతో మాట్లాడుతూ ‘‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆదివారం యథావిధిగా సెయింట్పీటర్స్ స్క్వేర్ నుంచి భక్తులను ఉద్దేశించి మాట్లాడతాను’ అని పోప్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం