ఇమ్రాన్ అరెస్టు అక్రమం
మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అక్రమమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తేల్చింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
వెంటనే విడుదల చేయాలి
పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అక్రమమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తేల్చింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి అరెస్టు చేయడంపై మండిపడింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్, న్యాయమూర్తులు జస్టిస్ మహమ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అల్ ఖదీర్ ట్రస్టుకు భూముల కేటాయింపు కేసులో ఇమ్రాన్ను బలవంతంగా అరెస్టు చేశారంటూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘కోర్టులో ఉన్న 70ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసే తీరు ఇదేనా.. కోర్టులో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడమంటే న్యాయాన్ని పొందే పౌరుడి హక్కును తిరస్కరించడమే. ఒక వ్యక్తి కోర్టుకు వచ్చాడంటే అతడు సరెండర్ అయినట్లే. అప్పుడు పోలీసులు అరెస్టు చేసేదేముంది.. 90 మంది కోర్టు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశిస్తే న్యాయస్థానం మర్యాద ఏమవుతుంది.. అరెస్టుకు ముందు వారు కోర్టు రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బందీ వేధింపులను ఎదుర్కొన్నారు’ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను.. రేంజర్లు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అవినీతి నిరోధక కోర్టు ఇమ్రాన్ను 8 రోజుల ఎన్ఏబీ కస్టడీకి ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ పీటీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గంటలో ఆయనను కోర్టులో హాజరుపరచాలని సూచించిన కోర్టు అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
కొనసాగిన ఆందోళనలు
పాకిస్థాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ అరెస్టుతో మంగళవారం ప్రారంభమైన అల్లర్లు గురువారమూ జరిగాయి. మరోవైపు పీటీఐ పార్టీ నేతల అరెస్టులూ ఆగడం లేదు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీని అరెస్టు చేశారు. ఆయన ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు. అల్లర్లకు పాల్పడిన 1500 మంది పీటీఐ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్లో డాలరు రూ.300
పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. గురువారం అమెరికా డాలరు విలువ 300 రూపాయలకు చేరింది. ఇమ్రాన్ అరెస్టుతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన మంగళవారం నుంచి రూపాయి విలువ మరింతగా దిగజారింది. కరాచీ స్టాక్ మార్కెట్పైనా అనిశ్చితి ప్రభావం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు