అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల భక్తులు సైతం ఆరాధనలో పాల్గొన్నారు.

Updated : 27 Dec 2023 06:27 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాల భక్తులు సైతం ఆరాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్‌ జాన్‌ బిల్లా, సుధ మాట్లాడుతూ.. ఏసు మన రోజువారీ జీవనంలో జోక్యం చేసుకొంటూ, మనల్ని దైవత్వం వైపు నడిపిస్తారని తెలిపారు. ప్రార్థన అనంతరం అంతా పాటలు, నాటికలతో క్రిస్మస్‌ సందేశం అందించారు. అట్లాంటా తెలుగు చర్చి ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని