Ukraine Crisis: ‘బుచా’ దారుణాలు.. రష్యాపై కఠినంగా వ్యవహరించిన జర్మనీ
ఉక్రెయిన్లో రష్యా చేస్తోన్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వం అని ఖండించిన జర్మనీ.. తన దేశంలోని 40 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించిన మాస్కో
బెర్లిన్: ఉక్రెయిన్లో రష్యా చేస్తోన్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వం అని ఖండించిన జర్మనీ.. తన దేశంలోని 40 మంది రష్యా దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జర్మనీ చర్యను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.
‘జర్మనీలో వివిధ విభాగాల్లో ఉన్న రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించడం వల్ల మన ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఇది ఇరు దేశాల సంబంధాల్లో క్షీణతకు దారితీస్తుంది. బుచా ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిగేవరకు ఆగకుండా జర్మనీ కీవ్కు మద్దతుగా నిల్చుంది. ఈ క్రమంలో బెర్లిన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నాం’ అని జర్మనీలోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 40 మంది దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లిపోవాలని జర్మనీ చెప్పినట్లు ధ్రువీకరించింది. ఫ్రాన్స్, లిథువేనియా కూడా ఈ తరహా చర్యలే తీసుకున్నాయి.
కీవ్కు సమీపంలోని బుచా పట్టణంలో ఇటీవల బయటకు వచ్చిన దృశ్యాలతో ప్రపంచం కలతచెందింది. రష్యా సైన్యం సామాన్య పౌరుల చేతులు కట్టేసి, తలపై కాల్చి హతమార్చినట్లు వాటి ద్వారా వెల్లడవుతోంది. అలాగే ఆ ప్రాంత వీధుల్లో దాదాపు 400 శవాలు కనిపించగా.. ఆ మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు 45 అడగుల పొడవైన గుంతను తవ్వినట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇక బాలికలు, మహిళలపై లైంగికదాడి జరిపి హతమార్చుతున్నట్లు ఉక్రెయిన్ ఎంపీలు ఆరోపించారు. కాగా, ఈ హింసాకాండను అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అలాగే రష్యాను మరింత కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో రష్యా గ్యాస్పై ఆధారపడినప్పటికీ ఐరోపా దేశాలు వెనక్కి తగ్గడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం