Sri lanka crisis: ‘ఆ నలుగురు’.. నరకం చూపించారు
వారు నలుగురు అన్నదమ్ములు.. కలసికట్టుగా ఉంటారు.. రాజకీయాల్లో రాణిస్తుంటారు.. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు..
(గొటబాయ రాజపక్స)
ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం: వారు నలుగురు అన్నదమ్ములు.. కలసికట్టుగా ఉంటారు.. రాజకీయాల్లో రాణిస్తుంటారు.. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు.. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం యత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు.. ఆఖరికి ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు. ఇదంతా మన పొరుగు దేశమైన శ్రీలంకలో రాజపక్స సోదరులు సాగించిన దోపిడీ పర్వం. ఒకప్పుడు వైభవంగా వెలిగిన వీరు గొటబాయ రాజపక్స(Gotabaya rajapaksa) పారిపోవడంతో నియంత పోకడలతో పాలన సాగిస్తే ఎప్పటికైనా శంకరగిరి మాన్యాలు పట్టవలసిందేనన్న సత్యానికి తాజా ఉదాహరణగా మిగిలారు..
కుటుంబ పెత్తనం... నిర్విరామ దోపిడీ
శ్రీలంక రాజకీయాల్లో రాజపక్సలది కీలకస్థానం. 2009లో మహిందా రాజపక్స తమిళ వేర్పాటు ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈని పూర్తిగా నిర్మూలించడంతో సింహళ జాతీయవాదులు ఆయనకు మద్దతుగా నిలిచారు. మహిందాతో పాటు ఆయన సోదరులైన చమల్, బసిల్, గొటబాయలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే తమకు ఎదురులేదన్న రీతిలో వారు పాలించారు. చైనా నుంచి పెట్టుబడుల ప్రవాహం సాగింది. తమ సొంత ప్రాంతమైన హంబన్టోటాలో భారీ నౌకాశ్రయాన్ని డ్రాగన్ సౌజన్యంతో నిర్మించారు. అయితే చెల్లింపులు చేయలేకపోవడంతో చివరకు 99 ఏళ్ల లీజుకు చైనాకు ధారదత్తం చేశారు. అయితే మహిందా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల్లో అధిక భాగాన్ని ఆయన సోదరులతో పాటు కుటుంబం ఇతర దేశాలకు తరలించినట్టు అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గొటబాయ ‘వైట్ వ్యాన్లు’
అన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గొటబాయ రాజపక్స అప్రకటిత సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. తమిళ పులులపై యుద్ధం నేపథ్యంలో ఆయన నేతృత్వంలో సైన్యం సాగించిన దాష్టీకాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రభుత్వంపై ఎవరు విమర్శించినా తెల్లవ్యాన్లలో సాయుధులు వచ్చి కిడ్నాప్లు చేసేవారు. అనంతరం అదృశ్యమైన వారి ఆచూకీ తెలిసేది కాదు. కిడ్నాప్లకు గురైన వారిని దారుణంగా హింసించి హత్య చేసినట్టు పలు సంస్థలు ఆరోపించాయి.
సేంద్రియ సేద్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు..
2015లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహిందా పరాజయం పాలయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మైత్రిపాల సిరిసేన బాధ్యతలు చేపట్టారు. రణిల్ ప్రధానిగా ఉన్నా వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తరవాత 2019 అధ్యక్ష ఎన్నికల్లో మహిందా సోదరుడు గొటబాయ అధ్యక్షుడిగా ఎన్నికయయారు. శ్రీలంక వ్యవసాయదేశం. అయితే సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేయాలంటూ గొటబాయ ఆదేశాలు జారీ చేయడంతో ఇతర దేశాల నుంచి వచ్చే ఎరువులు ఆగిపోయాయి. ఫలితంగా పంటలు ఎక్కువ దిగుబడి ఇవ్వలేదు. ఈ కారణంతోనే వ్యవసాయ దిగుబడి తగ్గిపోయింది. ప్రజలు ఆహార పదార్థాల కోసం రోడ్లపైకి రావడంతో అశాంతి ఏర్పడింది. తన సోదరులపై ఆరోపణలు రావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మహీందా, చమల్, బాసిల్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే దేశంలో అరాచకానికి కారణం గొటబాయ అని ఆయన గద్దె దిగాలని ఆందోళనలు చేపట్టారు. చివరకు ప్రజాగ్రహం అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో పలాయనం చిత్తగించారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
రాజపక్స సోదరులు వెళ్లిపోయినా ఇంకా చైనా రుణ ఊబి, ఆర్థిక ప్రతిబంధకాలు, విదేశీ చెల్లింపులు లేకపోవడం, ఆహార ధాన్యాల భద్రత లేకపోవడం.. తదితర అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే పాలనాపరంగా అనుభవం ఉన్నా తక్షణ ఉపశమనం ఆయన చేతుల్లో లేదు. శ్రీలంకకు భారత్ ఇప్పటికే వేలాది కోట్ల డాలర్లను అందజేయడంతో పాటు పెట్రోల్, ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఒకప్పుడు దక్షిణాసియాలో అన్ని అంశాల్లో ముందంజలో ఉండేది. అయితే జాతీయవాదం, చైనాకు దగ్గర కావడంతో పాటు రాజపక్స సోదరుల అవినీతి దేశాన్ని నాశనం చేసింది. పాలకులు చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు శ్రీలంకకు దశాబ్దాలు పట్టవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం